(Image source from: Akroorudu history in mahabharat and sitaram kalyan )
అక్రూరుడికి సంబంధించిన ప్రస్తావన మహాభారతంలో ప్రచురించబడింది. ఇతిహాస కథలలో కొన్ని విచిత్రమైన పాత్రలు ప్రత్యేకంగా చెప్పబడేవి. అందులో కొన్ని పాత్రలు ద్వంద్వ స్వభావాన్ని కనబరిస్తే... మరికొన్ని పాత్రలు ఇరువర్గాలకు నష్టాన్ని కలిగించేలా వుండేవి. అటువంటి పాత్రలలో విచిత్రమైన రూపాన్ని కలిగిన అక్రూరుడు ఒకడు. మొదట ఇతడు శ్రీకృష్ణుడికి విరోధిలాగా ప్రవర్తించినప్పటికీ... తరువాత అతని మీద భయం వున్నట్లుగా వ్యవహరించేవాడు.
పూర్వం కంసుడు ధనుర్యాగం పేరుతో శ్రీకృష్ణుడిని తన నగరానికి ఆహ్వానించాలని అనుకుంటాడు. అతని ఆహ్వానానికి ఏదైనా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో పడిపోతాడు. కొద్దిసేపటి తరువాత కృష్ణుడి ఆహ్వానం కోసం తగిన వ్యక్తిని ఎంపికచేయాలని భావించి, ఆ వ్యక్తి కోసం అన్వేషణ మొదలుపెడతాడు. ఆ క్రమంలో కంసుడు, అక్రూరుని ఎంపిక చేస్తాడు. శ్రీకృష్ణుడిని తన నగరానికి తీసుకుని రావాల్సిందిగా ఆదేశిస్తూ... అక్రూరుని రథసారథిగా కంసుడు పంపిస్తాడు. అక్రూరుడు, శ్రీకృష్ణుడు వద్దకు చేరుకున్న తరువాత కంసుని కపటోపాయం గురించి హెచ్చరిస్తాడు. దాంతో కోపాద్రిక్తుడైన కృష్ణ.. వెంటనే కంసుని దగ్గరకు వెళ్లి, అతని అనుచరులను హతమారుస్తాడు. చివరికి కంసుడిని కూడా చంపేస్తాడు.
శ్రీకృష్ణుడు, సత్యభామ వివాహ సందర్భంలో కూడా అక్రూరుడి పాత్ర కనబడుతుంది. పూర్వం సత్యభామ తండ్రి అయిన సత్రాజిత్తు... తన కుమార్తెను (సత్యభామ) శతధన్వుడు అనే రాజుకిచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు. కానీ కొన్ని కారణాల వల్ల సత్యభామ పెళ్లి శ్రీకృష్ణుడితో జరిగిపోతుంది. అది తెలుసుకున్న శతధన్వుడు కోపాద్రిక్తుడై అక్రూరుడితో కలిసి సత్రాజిత్తుని హతమారుస్తాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు.. శతధన్వుడిపై దండెత్తి, అతడిని యుద్ధంలో మతమారుస్తాడు. ఇది చూసిన అక్రూరుడు అక్కడి నుంచి పారిపోతాడు. కొంతకాలం తరువాత శ్రీకృష్ణుడు అక్రూరుడికి అభయమిచ్చి, తన ద్వారకలో వుండటానికి ఆశ్రయం కల్పిస్తాడు.
(And get your daily news straight to your inbox)
Nov 13 | రామాయణంలో రాముడి చేత సంహరించబడిన రావణుడు.. అంతకుముందే మరొకరి చేతిలో ఓడిపోయాడు. అతడి పేరే మాంధాత. ఇతడు యవనాశ్వుని కుమారుడు. భ్రుగు మహర్షి దాచి ఉంచిన మంత్రజలం సేవించినందువల్ల యవనాశ్వుని భార్యకు మాంధాత జన్మిస్తాడు.... Read more
Oct 08 | పూర్వం జీమూతకేతువు అనే చక్రవర్తికి ‘జీమూతవాహనుడు’ అనే కుమారుడు వుండేవాడు. ఇతను చిన్నప్పటి నుంచి రాజ్య ప్రజలు, అన్నిప్రాణుల పట్లా ఎంతో కారుణ్యంతో ఉండేవాడు. రాకుమారుడు అయినప్పటికీ అతనితో అహంకారం వుండేది కాదు. ఇటువంటి... Read more
Jun 14 | పాండవులు, ద్రౌపదికి కలిగిన ఐదుగురు సంతానాన్ని ఉప పాండవులగా పిలుస్తారు. పాండవులకు ఒక్కొక్కరుగా ఒక్కొక్క పుత్రుడు జన్మించారు. 1. ప్రతివింధ్యుడు - (ధర్మరాజు పుత్రుడు)2. శ్రుతసోముడు - (భీముని పుత్రుడు)3. శ్రుతకర్ముడు - (అర్జునుని... Read more
Jun 10 | సరస్వతీదేవిని ప్రతిఒక్కరు ఎంతో దైవంగా పూజిస్తారు. ఈమెను చదువుల తల్లిగా పేర్కొంటారు. సరస్వతీదేవి సన్నిధిల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే.. వారికి చదువు ఎంతో బాగా లభిస్తుందని, భవిష్యత్తు కార్యకలాపాల్లో విజయాలు సాధిస్తారని, జీవిత ప్రయాణంలో... Read more
Feb 17 | మొదటి అధ్యాయము : ఈ జగత్తులో సృష్టి లయానికి కారకుడు, దానికి వ్యతిరేకుడు ఎవరో, ఈ సమస్త జగత్తుకు కర్త ఎవరో, తన సొంత సిద్ధ జ్ఞానముతో విరాజిల్లువాడు ఎవరో, బ్రహ్మదేవునికి కూడా జ్ఞానాన్ని... Read more