మహబూబ్ నగర్ లో జరిగిన వోల్వో బస్సు ప్రమాదంలో 43 మంది ప్రయాణికిలు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రమాదం పై అధికారులు వేగవంతంగా చర్యలు చేపడుతున్నారు. బస్సు ప్రమాదం తెలుసుకున్న ఆయా రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. ముందుగా తెలుగుదేశం పార్టీ ముందు వరసులో నిలబడినట్లు సమాచారం. ప్రమాదంలో గాయాపడిన వారిని అదుకోవటానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు తనయుడు నారా లోకేస్ బాబు పరుగుపరుగున మహబూబ్ నగర్ జిల్లా బయలు దేరినట్లు టీడీపీ వర్గాల సమాచారం.
ఇటీవల రాష్ట్రంలో కురిచిన భారీ వర్షాల కారణంగా.. నష్టపోయిన వరద బాధితులను పరామర్శించటానికి వెళ్లిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నారా లోకేష్ బాబు వోల్వో బస్సు ప్రమాద ఘటన స్థలం వద్దకు చేరుకున్నట్లు సమాచారం. అయితే లోకేష్ బాబు కు చంద్రబాబు కొన్ని సూచనలు ఇవ్వటం జరిగిందని సీనియర్ టీడీపీ నాయకులు అంటున్నారు.
ప్రమాదం జరిగిన స్థలం వద్ద ఎలాంటి రాజకీయ విమర్శలు చేయవద్దని, గాయపడిన వారిని, ప్రమాదంలో మరణించి న వారి కుటుంబాలను, ప్రేమతో పలకరించి, వారికి వెంటనే ప్రభుత్వ సహాయం అందించాలని, వారికి కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేసే విధంగా లోకేష్ బాబు కు చంద్రబాబు వివరించినట్లు సమాచారం. తండ్రి ఇచ్చిన సమాచారం తో మహబూబ్ నగర్ జిల్లా కొత్త కొత్తకోట మండలం పాలెం వద్ద వోల్వో బస్సు ప్రమాద స్థలాన్ని లోకేష్ బాబు పరిశీలించారు. అయితే వెంటనే బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని లోకేష్ బాబు తండ్రి మాటలను తూ. చ పాటించినట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి. లోకేష్ చేసిన ప్రయత్నం.. పార్టీకి ఎంత మేలు చేస్తాయో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more