అక్కినేని నాగార్జున హీరోగా రూపోందుతున్న తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’ ప్రపంచవ్యాప్తం పేక్షకుల మందుకు వచ్చేనెల ఏప్రిల్ 2న రానుంది. ఈ చిత్రం ఇప్పటికే ప్రమోషన్ వర్క్ ను చేసుకుంటూ బిజీగా వుంది. ఇందులో భాగంగా హీరో అక్కినేని నాగార్జునతో చిత్రబృందం వరుస పెట్టి ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ గంగవ్వతో కూడా చిత్రాన్ని ప్రమోట్ చేయించారు నాగ్. తాజాగా వైల్డ్ డాగ్ మూవీ నుంచి టీజర్ ప్రోమోను విడుదల చేసారు. ఈ ప్రోమో కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. మన దేశంలో గతంలో జరిగిన టెర్రరిస్ట్ దాడుల ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు అహిషోర్ సాల్మన్.
కమర్షియల్ పంథా పక్కనబెట్టి పక్కా దేశభక్తి సినిమాను చేసాడు నాగార్జున. తాజాగా విడుదలైన ప్రోమోలో మన దేశంలో 1989లో అప్పటి హోం శాఖ మంత్రి ముఫ్తీ మహమ్మద్ సైయిద్ కూతురును టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తే 19 టెర్రరిస్టులను విడిచిపెట్టారు. 1999లో కాందహార్ ప్లేన్ హైజాక్ చేసినపుడు హఫీజ్ సైయ్యద్ సహా ముగ్గరు టెర్రరిస్టులను విడిచిపెట్టారు. ఆ తర్వాత హఫీజ్ సైయ్యద్.. ముంబాయిలో టెర్రర్ అటాక్ చేయించాడు. ఈ దాడిలో 174 మంది అమాయకులు చనిపోయారు. ఎంతో మంది కాలు చేతులు విరగొట్టుకొని దివ్యాంగులయ్యారు.
దేశంలో ఎన్నో మారుణ కాండలను చేసిన టెర్రరిస్టులను మనం ఏమి చేయలేం అంటే దానికి నేను ఒకే చెప్పను అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ బాగుంది. ఈ చిత్రంలో విజయ్ వర్మగా నాగార్జున డీల్ చేసిన కేసులో ఎవరు మిగలలేదు అనే డైలాగ్ బాగుంది. టెర్రరిస్టులను పట్టుకోని వాడికి బిర్యానీలను మేపడం లాంటివి చేయకూడదనే డైలాగులు ఆలోచింపచేసేలా ఉన్నాయి. మొత్తంగా టెర్రరిస్ట్ల కోసమే దేశంలో 29 కోట్ల మంది పోలీసులు, సైనికులు సహా ఎంతో మంది కాపలా కాస్తున్నట్టు చూపించారు ఈ టీజర్ ప్రోమోలో.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more