టాలీవుడ్ మెగాస్టార్.. మాజీకేంద్రమంత్రి, రాజ్యసభసభ్యుడు.. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, దానికన్నా ముందు ప్రజారాజ్యం పార్టీ అధినేత.. ఇలా పలు విధాలుగా చిరంజీవి తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడు. వాటిన్నింటికన్నా ఆయనను ఆ స్థాయికి తీసుకెళ్లింది మాత్రం కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే. అభిమానులే తన అయువు.. వారి సంక్షేమమే తన కర్తవ్యం అని ఎంతటి స్థాయికి ఎదిగినా.. తన అభిమాని బాధపడకూడదని ఆయన వారి కోసం బ్లడ్ బ్యాంకు, ’ఐ’ బ్యాంకు ఏర్పాటు చేసిన విషయం కూడా తెలిసిందే. ఇక చిరంజీవికి ప్రేక్షకులలోనే కాదు.. సినీపరిశ్రమలో కూడా అభిమానులు వున్నారంటే అది ఆయనకున్న క్రేజ్ అని చెప్పక తప్పదు.
అయితే ఓ టాలీవుడ్ హీరో అప్పట్లోనే తన అభిమాన హీరో చిరంజీవి అని నిర్మోహమాటంగా చెప్పారు. ఇక ఆయన తాజాగా తాను మెగాస్టార్ కు కేవలం అభిమానిని మాత్రమేనని, కానీ అనుచరుడ్ని కాదు అని తేల్చిచెప్పారు. అంతటితో ఆగకుండా మెగాస్టార్ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణకు విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో చిత్రపరిశ్రమ పేదలను అదుకునేందుకు చిరంజీవి ప్రారంభించిన కరోనా క్రైసెస్ ఛారిటీపై కూడా జేడీ చక్రవర్తికీలక వ్యాఖ్యలు చేశారు, ఈ సందర్భంగా చిరంజీవికి ఆయన ఓ బహిరంగ లేఖను కూడా రాశాడు. దాని సారంశం ఆయన మాటల్లోనే..
'ప్రియమైన చిరంజీవి.. నేను మీ అభిమానినే కానీ అనుచరుడిని కాను. ఎప్పట్నుంచో మిమ్మల్ని నేను నటుడిగా మాత్రమే ఇష్టపడేవాడ్ని.. ఒకప్పుడు నా తోటి నటులంతా సాయంత్రం అయ్యే సరికి మీ దగ్గరికి వచ్చి సమయం గడపడానికి ఆసక్తి చూపించే వాళ్లు.. కానీ నేనెప్పుడూ మీ దగ్గరికి రాలేదు.. రావాలనే ఆలోచన కూడా రాలేదు. ఇది నేను మీకు బహిరంగంగా రాస్తున్న లేఖ.. కరోనా వైరస్ తీసుకొచ్చిన నష్టం మాటల్లో చెప్పలేం.. లాక్డౌన్ చేయడంతో సినిమా పరిశ్రమ కూడా ఎంతో కోల్పోయింది. మాటల్లో చెప్పలేనంతగా సినీ కార్మికులు నష్టపోయారు.
అందులో నాతో పాటు మీరు కూడా ఉన్నారు.. మనం కూడా ఎంతో కొంత కోల్పోయాం.. ఈ ఆపత్కాలంలో ఇతరుల్ని ఆదుకోవడానికి మీరు ముందుకు రావడం అద్భుతం. అభిమానులే కాదు.. అందరూ మిమ్మల్ని ఎందుకు అంతగా ఇష్టపడతారో.. నమ్ముతారనే దానికి మీరు ఇప్పుడు చేస్తున్న కరోనా క్రైసిస్ ఛారిటీ నిదర్శనం. మీరు నా దృష్టిలో మెగాస్టార్ కాదు.. అంతకంటే ఎక్కువ.. ఓ గొప్ప వ్యక్తిగా మిమ్మల్ని అభివర్ణించాలి. కొన్ని రోజుల క్రితం కొందరు సినీ కార్మికులు నాకు ఫోన్ చేశారు. ఈ సమయంలో చిరంజీవి గారు లేకపోయుంటే నిజంగానే ఆకలితో చచ్చిపోయేవాళ్లం అని.. తమ కుటుంబాలకు ఇప్పుడు ఎలాంటి ఆకలి సమస్యలు లేవని.. అదంతా చిరంజీవి చలువే అని.. ఆయన తమకు అవసరమైన నిత్యావసర వస్తువులను అందించారని తెలిపారు.
మీకు అన్నం పెట్టిన చిత్ర పరిశ్రమకు ఇప్పుడు మీరు ఇలా రుణం తీర్చుకుంటున్నానని వాళ్లు నాతో చెప్పారు.. కానీ కార్మికుల పట్ల అది మీకున్న గౌరవం అని నేను భావిస్తున్నా. పది మందికి సాయం చేయాలనుకునే గుణం అద్భుతం.. చాలా మందికి హృదయం ఉంటుంది.. కానీ అది సరైన స్థానంలో లేక సాయం చేసే మనసు ఉండదు.. అందులో నేను కూడా ఉన్నాను. ఇప్పుడు నేను మెగాస్టార్ ని మరింత అభిమానిస్తున్నా. నలుగురి ఆనందం కోరుకునే మీ వ్యక్తిత్వం గొప్పది. నేనెప్పటికీ మీ అభిమానిని.. ఇకపై అనుచరుడిని కూడా.. మిమ్మల్ని అమితంగా ఇష్టపడుతున్నా, ప్రేమిస్తున్నా. లాక్డౌన్ లేకపోతే ఇప్పటికిప్పుడు మిమ్మల్ని కలవడానికి వచ్చేవాడ్ని. ఓ మంచి వ్యక్తిగా ఎలా మారాలనే విషయాన్ని మీ దగ్గర నేర్చుకోవాలి' అని జేడీ లెటర్ రాసాడు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more