స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆపదలో ఉన్న వారికి ఎల్లప్పుడు తన వంతు సాయాన్ని అందిస్తుంటారన్న విషయం తెలిసిందే. సినీపరిశ్రమలో కూడా అవసరంలో వున్నవారి గురించి తెలుసుకునే బన్నీ.. వారిని ఇంటికి పిలిచి మరీ సాయం చేస్తారన్న విషయం పోసాని కృష్ణమురళి బయటపెడితే కానీ బాహ్యప్రపంచానికి తెలియలేదు. బన్ని సహా ఈ మధ్యకాలంలో యువరక్తం నిండిన యంగ్ హీరోలు అందరూ సామాజిక సృహతో తమ వంతుగా ముందుకు కదలడం శుభసూచకం.
తాజాగా తిత్లీ తుఫాను వలన నిరాశ్రయిలన వారికి అండగా నిలిచేందుకు 25 లక్షల ఆర్ధిక సాయం అందిస్తున్నట్టు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు అల్లు అర్జున్. తిత్లీ ఎందరో జీవితాలలో విషాదం నింపిందని తెలిసి కలత చెందాను. అందుకే వారికి నా వంతు బాధ్యతగా విరాళం అందిస్తున్నాను. మీరు కూడా మీకు తోచినంత సాయం చేసి ఇబ్బందులలో ఉన్న వారిని ఆదుకోండి అని తన అభిమానులకు కూడా పిలుపునిచ్చారు బన్నీ. ఇక ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ కూడా మూడు లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాలలోనే కాక పక్క రాష్ట్రాలలోను ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం తర్వాత ఏ సినిమాకి కమిట్ కాలేదు. అయితే తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించేందుకు సై అంటూ సంకేతాలు ఇచ్చాడని, అందుకోసం న్యూలుక్ తో కూడా రెడీ అయ్యాడని తెలుస్తుంది. అరవింత సమేత సూపర్ హిట్ కావడంతో బన్ని ఈ నిర్ణయం తీసుకున్నాడని టాక్ వస్తున్నా.. న్యూలుక్ మాత్రం అదరగోడుతున్నాడు.. బన్ని.
I am saddened by the news and it's heart wrenching to see the damage done by the Cyclone. I pledge 25 lacs to the victims of the Titli Cyclone, let us all do our bit to help our people in these times of distress. #TitliCycloneVictims
— Allu Arjun (@alluarjun) October 20, 2018
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more