‘గోపాల గోపాల’ తర్వాత విక్టరీ వెంకటేష్ ఇటీవలే ఓ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రంతో దర్శకుడిగా మంచి ప్రశంసలు అందుకున్న దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వెంకటేష్ ఓ చిత్రం చేయనున్నాడు.
క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించనున్న ఈ చిత్రాన్ని యువ నిర్మాత పరుచూరి కిరిటీ నిర్మించనున్నాడు. ఇందులో వెంకటేష్ సరసన నయనతార హీరోయిన్ గా నటించనుంది. ఇప్పటికే వెంకీ, నయనతార కాంబినేషన్లో ‘లక్ష్మీ’, ‘తులసి’ వంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలొచ్చాయి. తాజాగా రూపొందనున్న ఈ చిత్రానికి ‘సంతోషమే సగం బలం’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్స్, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. గోపి సుందర్ సంగీతం, విఎస్ జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫిని అందించనున్నాడు. ఆగష్టు నెల చివరి వారంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more