ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ చిత్రాల హవా కొనసాగబోతుందా అంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి అదే అనిపిస్తుంది. ఇప్పటికే ‘సీ.వా.సి.చె ’ చిత్రం వచ్చి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దాని తరువాత నుండి టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాల ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అక్కనేని ఫ్యామిలీ మూడు తరాల నటులు కలిసి ‘మనం ’ అనే సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. దగ్గుబాటి రామానాయుడు కూడా కొడుకు వెంకటేష్, మనవడు రాణాతో ఓ చిత్రం చేయాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ఇక తాజాగా మంచు ఫ్యామిలీ కూడా (మోహన్ బాబు, విష్ణు, మనోజ్) కలసి ఒకే సినిమాలో నటించేందుకు రంగం సిద్ధమవుతోందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాని మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి నిర్మించబోతుందని, ఓ మంచి కథను తయారు చేసే బాధ్యత ప్రముఖ రచయితకు అప్పగించిందని కూడా టాలీవుడ్ వర్గాల వార్తలు. మరి వీటిలో ఏ ఫ్యామిలీ చిత్రం సక్సెస్ సాదిస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more