ప్రస్తుతకాలంలో క్లాసికల్ మ్యూజిక్ అంతగా ప్రాచుర్యంలోకి లేదుకానీ.. గత దశాబ్దాలక్రితం మాత్రం దీని హవాయే ఎక్కువగా నడిచేది. అప్పట్లో ఆ క్లాసికల్ మ్యూజిక్ లో ఎంతోమంది తమ ప్రతిభను నిరూపించుకున్నవాళ్లు చాలామందే వున్నారు. ఒకరికొకరు పోటాపోటీతో రంగంలోకి దిగేవారు. ఎంతోమంది ప్రముఖులు కూడా వున్నారు. అటువంటివారిలో అబ్దుల్ కరీంఖాన్ లేదా ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ కూడా ఒకరు. ఈయన 20వ శతాబ్దపు హిందుస్తానీ సంగీతంలోని కిరాణా ఘరానాకు చెందిన వారిలో ప్రముఖుడు.
జీవిత చరిత్ర :
1872 నవంబర్ 11వ తేదీన ఉత్తరభారతంలోని కిరాణా అనే ప్రాంతంలో అబ్దుల్ కరీంఖాన్ జన్మించారు. ఈయన తండ్రి పేరు కాలే ఖాన్. ఆనాడు కిరణా ఘరానాకు మూలపురుషులైన గులాం అలీ మనవడు కాలే ఖాన్! కరీంఖాన్ తన తండ్రి, మామ అబ్దుల్లా ఖాన్ దగ్గర సంగీతంలో శిక్షణ పొందారు. అతి తక్కువ సమయంలోనే సంగీతంలో వున్న వివిధ నైపుణ్యాలను సంపాదించేసుకున్నారు. . గాత్రం, సారంగి, వీణ, సితార్, తబలా అన్నింటినీ నేర్చుకున్నారు కరీంఖాన్!
సంగీత ప్రస్థానం :
కరీంఖాన్ మొదట్లో సారంగి వాయించడం మొదలుపెట్టినా.. క్రమక్రమంగా ఆయన గాత్రాన్ని నేర్చుకున్నాడు. అలా నేర్చుకోవడం వల్ల ఆయన తన సోదరుడు అబ్దుల్ హక్ తో కలిసి పాటలు పాడేవాడు. ఒకనాడు బరోడా రాజువారి దర్బార్ లో పాటలు పాడే ప్రదర్శనలో కరీంఖాన్ అద్భుతంగా తన గాత్రాన్ని వినిపించడం వల్ల అందుకు రాజు ముగ్ధుడై వారిని తన ఆస్థాన సంగీత విద్వాంసులుగా నియమించుకున్నారు. దాంతో కరీంఖాన్ దశ అక్కడినుంచి ఒక్కసారిగా తిరిగిపోయింది. అక్కడే ఆయన రాజవంశానికి చెందిన తారాబాయ్ మానెను వివాహం చేసుకున్నారు.
వివాహ జీవితం :
అయితే కొన్నాళ్ల తర్వాత ఆ దంపతులు బరోడా నుంచి బహిష్కృతులై, ముంబై చేరుకున్నారు. అక్కడ కూడా కొన్నాళ్లపాటు సజావుగానే తమ జీవితాన్ని ఆస్వాదించిన వాళ్లిద్దరి మధ్య అనుకోని తగాదాలు రావడం వల్ల 1922లో కరీంఖాన్ తన భార్యను వదిలేసి వెళ్లిపోయారు. అప్పడు ఆయన జీవితంలో ఎన్నో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరికొన్ని విషయాలు :
మైసూరు దర్బారులో వున్నప్పుడు అక్కడ గొప్ప కర్ణాటక సంగీత గాయకులను కలుసుకోవడం వల్ల వారి ప్రభావం కరీంఖాన్ పాటల్లో కనిపించేది. 1900లో ఆయన ప్రఖ్యాత గాయకుడు, సవాయి గంధర్వకు ఎనిమిది నెలలవరకు సంగీతాన్ని నేర్పించారు. అలాగే అక్కడే మరో ప్రసిద్ధి సంగీత విద్వాంసురాలు కేసర్బాయ్ కేర్కర్కు శిక్షణ ఇచ్చారు. 1913లో పుణెలో అబ్దుల్ కరీంఖాన్ ఆర్య సంగీత విద్యాలయాన్ని స్థాపించాడు. తరువాత మీరజ్ లో స్థిరపడి, మరణించేంత వరకూ (1937) అక్కడే ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more