వేంకటేశ్వరుని పై వేలకొలది పాటలు రచించి, ఈనాటికీ సంకీర్తలకు చిరునామాగా దర్శనమిస్తున్న తాళ్లపాక అన్నమయ్య ఆంధ్రదేశానికి ఆణిముత్యమై నిలిచారు. 15వ శతాబ్ధంలో జన్మించిన అన్నమాచార్యుడు తాళ్లపాక అనే గ్రామంలో జన్మించారు.. ఇప్పుడు ఈ గ్రామంలో ఆంధ్ర్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఉంది. బాల్యంలోనే అమితమైన భక్తి ప్రపత్తులను అలవరుచుకున్న అన్నమయ్య తిమ్మక్కను వివాహం చేసుకున్నారు.
ఈమె సుభధ్రా కల్యాణం అనే పద్య కవితను రాసి తొలితెలుగు మహిళా రచయిత్రిగా పేరుగాంచారు. కాగా అన్నమయ్య శ్రీని వాసునిపై 36వేల సంకీర్తనలకు రచించారు. అయితే ప్రస్తుతం వీటిలో 12వేల సంకీర్తనలు మాత్రమే మనకు లభ్యమయ్యాయి. భక్తిలోని భావగంభీర్యాన్ని అన్నమయ్య తన కీర్తనల్లో వెల్లడించారు.ఇవి ప్రతీ భక్తుడినీ ఎంతో పారవశ్యానికి గురిచేస్తాయి.. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రచనలు కొనసాగించిన అన్నమయ్య పదకవితా పితామహునిగా పేరొందారు.
ఇతని కీర్తనల్లో ప్రజా చైతన్యం కూడా కనిపించేది. అన్నమయ్య రచించిన బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే కీర్తన సామాజిక చైతన్యం నేపధ్యంగా కనిపిస్తుంది. మానవత్వ లక్షణాలను నిలబెట్టుకోవాలన్న కాంక్షను పురిగొల్పుతుంది. అగాగే ఏ కులమైనా గానీ ఎవ్వడైన నేమి అనే కీర్తనలో అందరూ సమానమేనని అన్న మయ్య చాటారు. అతని పాటల్లో కనిపించే తేలికైన పదాలు పండిత పామర జనానికి ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఉంటాయి. అందుకే అన్నమయ్య కీర్తనలకు అంతప్రాధాన్యత ఏర్పడింది.
అదేవిధంగా ఈ కీర్తనలు ఆంగ్లంలోకి అనువాదమవడం విశేషం. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్యకు తగిన గుర్తింపునిస్తూ అనేక కార్య్రక్రమాలను నిర్వహిస్తున్నది.. ముఖ్యంగా సుప్రసిద్ధ గాయకులు మంగళం పల్లి, డాక్టర్ శోభారాజు తదితరులు అన్నమయ్య కీర్తనలకు ఎంతో ప్రాచుర్యాన్ని కల్పిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more