|
రచయితగా , దర్శకుడిగా, నటుడిగా , బహుముఖ స్రుజనశీలిగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితులైన సీహెచ్. సుమన్ గురువారం రాత్రి 12.18 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 45 సంవత్సరాలు . నాలుగైదేళ్లుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన కొద్ది నెలలుగా హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామేజీరావు రెండో కుమారుడైన సుమన్ 1966 డిసెంబర్ 23న జన్నించారు. ఉషోదయా ఎంటర్ ప్రైజెస్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఒక పాప, ఒక బాబు, భార్య విజయేశ్వరి రామేజీ గ్రూపు సంస్థల్లో భాగమైన డాల్పిన్ హోటల్స్ కు మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. సుమన్ అంత్యక్రియలు శుక్రవారం రామేజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించనున్నట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి.
బహుముఖ ప్రజ్ఞాశాలి.. సుమన్
చదువుకు స్రుజన తోడైతే రాణింపు ఎలా ఉంటుందో చెప్పేందుకు ఉదాహారణ సుమన్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారాయన. చదువులో ఎప్పుడూ ముందు వరుసులోనే ఉంటేవారు. పాఠశాల విద్య స్థాయిలోనే ఆయనకు పాత్రికేయ వ్రుత్తిపై ఆసక్తి కలిగింది. ఆ దిశగానే పని చేశారు. నిజామ్ కాలేజీలో బి.ఎ. చదివారు. రాజునీతి, అర్థ శాస్త్రం, ఆంగ్లం ప్రధానాంశాలుగా డిగ్రీ చదివారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.సి.జే చదివారు. జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు ఆమెరికా వెళ్లారు. జర్నలిజంలో ఇంటర్న్ షిఫ్ ను ‘ఈనాడు’లో చేశారు. ఈనాడు పత్రికలోని జనరల్ డెస్క్ లో పని చేశారు. వివిధ సందర్భాల్లో ఈనాడు సంపాదకీయం పేజీకి అరవై ప్రత్యేక వ్యాసాలు రాశారు.
దిగ్గజాల శిష్యకరింలో
చిన్నప్పటి నుంచీ తెలుగు భాషంటే సుమన్ కు మక్కువ ఎక్కువ. కుమారుడి ఆసక్తిని గమనించిన రామేజీరావు ప్రముఖ కవి కొండవీటి వేంకటకవి దగ్గర శిష్యుడిగా చేర్చారు ఏడేళ్లపాటు ఆయన శిష్యరికంలో తెలుగు భాషపై సాధికారికత తెచ్చుకొనేందుకు క్రుషి చేశారు. బాల వ్యాకరణం, ప్రౌడ, వ్యాకరణం, నీతి చంద్రిక , శతకాలు, వసుచరిత్ర, మనుచరిత్ర, లాంటివి ఆయన వద్దనే చదువుకున్నారు. వేంకటకవి వద్ద సంస్ర్కుత భాషతో కూడా పరిచయం పెంచుకున్నారు. అమెరికాలో విద్య పూర్తి చేసుకొని వచ్చిన తరువాత జర్నలిజంలో కొనసాగారు. ఆ సయయంలో ప్రముఖ సినీ రచయిత డి.వి. నరసరాజుతో సన్నిహితంగా మెలిగారు. పుస్తక రచన, స్ర్కీన్ ప్లే లాంటి అంశాలపై నరసరాజుతో సుదర్ఘీంగా చర్చించేవారు. సుమన్ రచనలు, అమెరికా అదుర్ ష్టం, సభ్య సమాజం, తదితరాల్లో అచ్చ తెలుగు హాస్యం తొణికిసలాడింది.
సుమన్ ఇంటింటి టీవీ
సుమన్ మేనేజింగ్ డైరెక్టర్ గా 1995 ఆగస్టు 27న ‘ఈటీవీ’ ప్రారంభమైంది. ఈటీవీని ఇంటింటి టీవీగా తీర్చిదిద్దడంలో ఆయన అవిరళ క్రుషి సలిపారు. కేవలం ఛానెల్ నిర్వహణకే పరిమితం కాకుండా స్రుజనాత్మక విభాగాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ‘అంతరంగాల’ ‘లేడి డిటెక్టివ్’, ‘స్నేహం’ , ‘ఎండమావులు’, ‘కళంకిత’ లాంటి ధారావాహికలు ప్రేక్షకుల్ని ఎంతగానో రంజింపజేశాయి. ఆ ధారావాహికలకు కథ, మాటలు, పాటలు, స్ర్కీన్ ప్లే ఆయనే సమకూర్చేవారు. దర్వకత్వం మీదా సుమన్ కి సాధికారత ఉంది. అన్ని వయసులవారినీ, అన్ని వర్గాల వారినీ మనసులో ఉంచుకొని కార్యక్రమాల్ని రూపొందించారు. ‘‘ కార్యక్రమాల రూపకల్పనలో నా వ్యక్తిగత అభిరుచులకు చోటుండదు. ప్రేక్షకుల అభీష్టానికే పెద్ద పీట ’’ అనే వారు సుమన్. తన రచనలో గానీ, ధారావాహిక లోగానీ, ఎక్కడా అశ్లీలత, ద్వంద్వార్థాలు , మితిమీరిన హింసకు తావు లేకుండా జాగ్రత్త పడేవారు. ఈటీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాలను ఆయన ఒకటికి రెండు సార్లు పరిశీలించుకొనేవారు. అవసరాన్ని బట్టి మార్పు చేర్పులు చేయించేవారు. ఆయన ఎక్కువగా వినోదాన్ని ఇష్టపడేవారు. దాంతో పాటు కుటుంబ బంధాలు , తెలుగుధనం నిండిన వాతావరణాన్ని తన ధారావాహికలల్లో కనిపించేలా చూసుకొనేవారు. సుమన్ కి చిత్రలేఖనంలో మూడోయేట నుంచే మక్కువ. ఆయన ఆసక్తి చూసి రామోజీరావు చిత్రకళకు సంబంధించిన ఎన్నో పుస్తకాలను అంధించారు. జవహర్ బాలభవన్ లో నిర్వహించే పోటీలో ఆయన అనేక బహుమతులు అందుకున్నారు. కార్టూనిస్ట్ శ్రీధర్ దగ్గర కొన్ని మెలకువలు తెలుసుకున్నారు. సందర్భాన్ని బట్టి విపుల, చతుర మాస పత్రికలకు సమన్ బొమ్మలు గీసేవారు. తన సీరియళ్లకు అవసరమైన వర్ణచిత్రాలను ఆయనే గీసేవారు. తన సారథ్యంలో నిర్మాణమై, ప్రేక్షకులను అశేషంగా ఆకట్టుకున్న పలు సీరియళ్లకు నంది పురస్కారాలు అందుకున్నారు. తన సీరియళ్ల ద్వారా ఎంతోమంది కళాకారులను పరిచయం చేశారు.
వెండితెరపైన సుమన్
‘ఉషాపరిణయం’ చిత్రంతో సమన్ తనదైన ముద్రతో వెండి తెరపైనా కనిపించారు. దానికి ఆయనే దర్శకత్వం వహించారు. భాగవత గాధతో అల్లుకొన్న పౌరాణిక చిత్రమిది. ఇందులో ఆయన శ్రీక్రిష్టుడిగా నటించారు. ఆ తరవాత పూర్తిస్తాయి వినోదాత్మక చిత్రం ‘నాన్ స్టాప్’ రూపొందించారు. ఆయన దర్శకత్వంలోనే వచ్చిన ఈ చిత్రంలో కథానాయకుడిగానూ నటించారు. ఆధ్మాత్మిక భావనలు మెండుగా ఉన్న సుమన్ ‘శ్రీహరిస్వరాలు’ పేరుతో భక్తి గీతాల ఆల్బమ్ ని రూపొందించారు. తను రాసిన గీతాలకు బాణీలు కూడా ఆయనే కట్టారు. నాయనమ్మ వెంకట సుబ్బమ్మ ప్రభావం సుమన్ పై ఉంది. చిన్నతనంలో నాయనమ్మ చెప్పిన పౌరాణిక కథలు ఆయనపై చెరగని ముద్రను వేశాయి. శ్రీహరిస్వరాలు రాసినా, పౌరాణిక చిత్రాలు తీసినా, పౌరాణిక పాత్రలు వేసినా ఆమె చెప్పిన కథలే తనకు స్పూర్తి అనేవారు సుమన్ . ఆయన ఈ లోకంలో లేకపోయిన ఆయన రచనలు, పాటలు, నటన , తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more