అమెరికాలో భారత దౌత్యవేత్త దేవయాని కొర్బగాడే అరెస్టు, విచారణ విషయంలో అమెరికా పోలీసులు అనుసరించిన వైఖరిపై భారత్ లో తీవ్ర నిరసన వెల్లువెత్తింది. భారత ప్రభుత్వం కూడా ఈ చర్యను తీవ్రంగా పరిగణించి తగు రీతిలో చర్యలు చేపట్టింది. ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు ఈ చర్యను ముక్తకంఠంతో ఖంఢించాయి. అమెరికా పోలీసుల వ్యవహారం తీవ్రంగా గర్వించదగినదని మన ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. దేవయాని కొర్బగాడే ను వెంటనే మన దేశానికి సగౌరవంగా తీసుకురావడం తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని విదేశాంగ శాఖ మంత్రి సల్మాణ్ ఖుర్శీద్ అన్నారు. అంతేకాకుడా రాజ్యసభలో దేవయాని కేసు విషయంపై సభ్యులంతా ముక్తకంఠంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తగిన చర్యలు చేపట్టాలని రాజ్య సభ సభ్యులు డిమాండ్ చేశారు.
అయితే దేవయాని పట్ట అనుసరించిన తీరు పై భారత్ కు అమెరికా క్షమాపణ డిమాండ్ చేస్తుండగా, ఇప్పటి వరకు అమెరికి ఈ విషయంలో ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు కానీ పరిస్థితులను సమీక్షిస్తున్నామని పేర్కొంది. అయితే దేవయాని కేసును క్రిమినల్ నుంచి సివిల్ విభాగానికి మార్చాలని భారత్ కోరుతోంది. అయితే భారత్ ఆగ్రహం చూసిన అమెరికా స్వరం మార్చినట్లే కనిపిస్తోంది. అక్కడ జరిగిన సంఘటనపై వేర్వేరు ప్రభుత్వ విభాగాలు ఒకరి మీద ఒకరు నిందోరోపణల పర్వం మొదలు పెట్టాయి. స్టేట్ డిపార్ట్ మెంట్ మార్షల్స్ మీదికి నెడుతోంటే, మార్షల్స్ మాత్రం స్టేట్ డిపార్డ్ మెంట్ దౌత్యాధికారిని అరెస్టు చేసిందని ,తరువాత జరగాల్సిన పద్దతుల్ని తాము అనుసరించామని అంటున్నారు. అయితే దేవయాని విషయంలో యూఎస్ ఇంటర్నేషనల్ ప్రొటోకాల్ అండ్ ఎర్రర్ ఆఫ్ జడ్జిమెంట్ పూర్తి వైఫల్యమని దేవయని తరుపు న్యాయవాది పేర్కొన్నారు.
దేవయాని విషయం లో భారత్ చేపట్టిన చర్యలు ఇవే
* భారత విమానాశ్రయాల్లో అమెరికా దౌత్యవర్గాలకు ఉణ్న ప్రత్యేక సౌకర్యాలను రద్దుచేసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది.
* భారత్ లోని అమెరికా దౌత్య కార్యాలయాల్లో పని చేస్తున్న భారతీయల వివరాలు ఇవ్వాలని కేంద్రం అమెరికా దౌత్యకార్యాలయాన్ని ఆదేశించింది.
* భారత్ లో పర్యటిస్తున్న అమెరికా చట్టసభ సభ్యుల కమిటిని కలుసుకునేందుకు లోక్ సభ స్పీకర్ మీరాకుమార్, కేంద్ర, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే , కాంగ్రెస్ ఉపాద్యక్షుడు రాహుల్ గాంధీ , గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ నిరాకరించారు.
* న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ముందు వున్న ట్రాఫిక్ బారికేడ్లను తొలగించమని పోలీసు శాఖకు అదేశాలు జారీ చేసింది.
* భారత్ లో అమెరికా రాయబారి నాన్సీపావెల్ ను భారత విదేశాంగ శాఖ అధికారులు ఫిలిపించి ఘటనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
* భారత దౌత్యవేత్త పట్ల అమెరికా అనుసరించిన వైఖరి ఎవరికీ అంగీకారం కాదని కేంద్ర విదేశాంగమంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు
* అమెరికా వైఖరికి తగురీతిలో సమాధానం చెప్పేందుకు మరిన్ని కఠినమైన చర్యలు చేపట్టాలని భాజపా నేత యశ్వంత్ సిన్హా డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more