‘‘ తిరిగే కాలు.. అరిచే నోరు ..కుదురుగా ఉండవని ’’ మన పెద్దలు చెబుతుంటారు.. ఇది అక్షరాల నిజం చేస్తున్నారు మన రాజకీయ నాయకులు. రాజకీయ నాయకుల నోరుకు దురద పుట్టిన ప్రతీసారి .. మీడియా ముందు ఏదోఒక విచిత్రమైన ప్రకటన చేసి, వారి నోటి దూల తీర్చుకుంటారు. ఇలాంటి రాజకీయ నాయకుల నోటి దూల వలన ప్రజల అనేక రకాలుగా ఇబ్బంది పడుతారన్న విషయం వీరికి తేలియటం లేదు. అసలే రాష్ట్ర విడిపోతుంది, తెలుగు ప్రజలు విడిపోతున్నారు. తెలుగు జాతి రెండుగా విడిపోతుందనే బాధలో తెలుగు ప్రజలు ఉన్నారు. కొంతమంది తమ రాజకీయ లబ్ధి కోసం ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారనేది పచ్చి నిజం.
రాష్ట్ర విభజన అనేది జరగటం 1000 % ఖాయమని .. కేంద్రం చేస్తూన్న హడవుడి ఇందుకు నిదర్శనం. అందులో కొంత మంది సీమాంద్ర నాయకులు కూడా.. రాష్ట్ర విభజన జరిగిపోయిందనే విషయాన్ని మీడియా సాక్షిగా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో.. తెలంగాణ నేతల్లో కొత్త తొందరపాటు కనిపిస్తుంది. అసలు తెలంగాణ నేతల దూకుడు దేని గురించి ఎవరికి అర్థం కావటం లేదు. ఎందుకంటే.. తెలంగాణ నేతలకు తెలంగాణ రాష్ట్రం రావటం ఇష్టం లేదనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే.. రాష్ట్ర విభజన ప్రక్రియ వేగం వంత అయ్యిందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్ర విభజన ప్రకటన చేసిన రోజే.. హైదరాబాద్ ఉమ్మడి రాజదానికిగా 10 ఏళ్ల పాటు ఉంటుందని చెప్పటం జరిగింది. ఇప్పుడు కొంత మంది తెలంగాణ నేతలు .. హైదరాబాద్ ఉమ్మడి రాజదానికి సీమాంద్ర వాళ్లకి 10 ఏళ్లు అవసరం లేదని, ఒకటి లేదా రెండు, మూడు ఏళ్లు మాత్రమే చాలు అని కేంద్రానికి తెలంగాణ నేతలు ఉచిత సలహాలు ఇవ్వటం చూస్తే.. ఎవరికైన సరికొత్త అనుమానాలు రేకేత్తున్నాయి. వీరికి తెలంగాణ రాష్ట్రం రావటం ఇష్టం లేదని విషయాన్ని ఈ రూపంలో చెబుతున్నారని కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
అందుకు ఉదాహారణే.. మొన్న తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొ. కోదండరాం..మాట్లాడుతూ.. సీమాంద్ర వాళ్లకి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మూడేళ్లు ఇస్తే సరిపోతుందని జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. ఈరోజు అదే బాటలో టీఆర్ఎస్ నాయకులు.. రాష్ట్ర విభజన తరువాత కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో కొత్త రాజధాని నిర్మాణానికి ఒకట్రెండేళ్లకు మించి వ్యవధి అక్కర్లేదని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగింపును మూడేళ్లకే పరిమితం చేయాలన్న తెలంగాణ జేఏసీ డిమాండ్పై ఈటెల ఈ విధంగా స్పందించారు. హైదరాబాద్ను పదేళ్లదాకా, ఉమ్మడి రాజధానిగా ఉంచే విషయంపై తాము మొన్నటి వరకు ఆలోచించామని అయితే, సీమాంధ్రలో పెద్దపెద్ద కాంట్రాక్టర్లే ఉన్న కారణంగా రాజధాని నిర్మాణానికి అంత గడువు అక్కర్లేదని అనుకుంటున్నావుని రాజేందర్ చెప్పారు. విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందానికి (జీవోఎంకు) తెలంగాణ జేఏసీ నివేదిక ఇచ్చినా పార్టీతరఫున తామూ నివేదిక ఇస్తావున్నారు. అయితే, పార్టీ నివేదికలో ఏ అంశాలుంటాయో చెప్పడానికి ఆయన నిరాకరించారు.
అయిన సీమాంద్రలో పెద్దపెద్ద కాంట్రాక్టర్లే ఉంటే.. సీమాంద్రాకు కొత్త రాజధాని రెండు మూడు సంవత్సారల్లో ఏర్పాటు అవుతుందనే విషయాన్ని తెలియజేసినందుకు టిఆర్ఎస్ నేతలకు ధన్యవాదాలు చెప్పాలి. ఇంత గొప్ప విషయం తెలిసిన మీరు 56 సంవత్సరాల నుండి.. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం ఎందుకు చేశారు? తెలంగాణలో మేధావులు, రాజకీయ పండితులు, చాలా మంది ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రతేక్య తెలంగాణ రాష్ట్రం కోసం .. 60 సంవత్సరాలు పట్టింది. అలాంటిది.. 60 సంవత్సరాలు మీలాంటి మేధావులతో కలిసి ఉన్నప్పటికి.. సీమాంద్రలో మేధావులు లేరని .. మీ నాయకుడి పబ్లిక్ మీటింగులో చెప్పటం జరిగింది.
మేధావులైన మీకే.. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవటానికి 60 సంవత్సరాలు పడితే.. మేధావులేని సీమాంద్రలో కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలంటే ఏన్ని సంవత్సరాలు పట్టాలి? అని సీమాంద్ర కాంగ్రెస్ నాయకులు, ప్రజలు అడుగుతున్నారు. ఇలాంటి విచిత్రమైన ప్రకటనల చేయటం ద్వారా.. ఇరుప్రాంతల వారికి నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు. ‘‘ రెండు పిల్లులు.. ఒక కోతి కథ’’ మాదిరిగా మనం నష్టపోవాల్సి వస్తుందని తెలుగు ప్రజలు అంటున్నారు. ఒకే రొట్టె కోసం కోట్టుకుంటున్న పిల్లులకు , తీర్పు చెప్పటానికి వచ్చిన కోతి ఏం చేసిందో తెలిసిన విషయమే. నోటి దాక వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ నెతలు ఎందుకు అడ్డుపడుతున్నారో అర్థం కావటంలేదని.. తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. సీమాంద్ర వాళ్లు పది అంటే.. తెలంగాణ నేతలు రెండు లేదా మూడు అంటే.. ఇలా గొడవలు ముదిరితే.. అమ్మకు ఆగ్రహం వచ్చి, హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తున్నం అని ప్రకటన చేస్తే.. అప్పుడు ఇరుప్రాంత వారు పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని.. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సో ఇకనైన ఇలాంటి చౌకబారు ప్రకటనలు చేయటం మానుకోవాలని రాజకీయ మేధావులు కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more