సమైక్యాంద్ర కోసం పోరాటం చేస్తున్నమని చెప్పుకుంటూ.. సీమాంద్రలో తిరుగుతున్న నాయకులకు .. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ గట్టి షాకిచ్చింది. సీమాంద్ర నాయకులతో పాటు, సీమాంద్ర ప్రజలు కూడా పనబాక లక్ష్మీ ఇచ్చిన షాక్ కు ఖంగుతిన్నారు. రాబోయే ఎన్నికల్లో నేను బాపట్ల నుంచే పోటీ చేస్తా కానీ.. తెలంగాణకే ఓట్టేస్తానని మీడియా సాక్షిగా పనబాక చెప్పటమే.. సీమాంద్రలో నాయకుల్లో కొత్త తుపాన్ పుట్టింది అయితే ఆమె వ్యక్తిగతంగా తాను సమైక్యవాదినేనని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పునరుద్ఘాటించారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ విప్ జారీచేస్తే విభజనకు అనుకూలంగా ఓటేస్తానని ఆమె వెల్లడించారు.
భద్రాచలాన్ని సీమాంధ్రకే చెందేలా రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల కమిటీకి నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపారు. బీజేపీ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందని పనబాక విమర్శించారు. విభజనకు సీమాంధ్ర ప్రజలు మానసికంగా సిద్ధపడాలని ఆమె నిన్న కోరారు. సీమాంధ్రలో పలు సంస్థలు స్థాపించాలని జీవోఎంను కోరినట్లు తెలిపారు. విభజన అనివార్యమైతే హైదరాబాద్ను యూటీ చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బాపట్ల నుంచే కాంగ్రెస్ తరఫున పోటీచేస్తానని, కాంగ్రెస్లోనే కొనసాగుతానని మంత్రి స్పష్టం చేశారు. బీజేపీ మద్దతు ఇస్తేనే తెలంగాణ బిల్లు పాస్ అవుతుందని పనబాక తెలిపారు.
ఇప్పటి వరకు సమైక్యంద్ర జై అంటూ.. లోపల విభజనకు సై అంటున్న సీమాంద్ర రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారనే విషయం సీమంద్ర ప్రజలకు తెలుసు. అయితే నేను సమైక్యవాదినే కానీ.. తెలంగాణకు సపోర్టు చేస్తానని చెప్పిన మొట్ట మొదటి సీమాంద్ర మహిళ నాయకురాలు.. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ. సీమాంద్ర ప్రజలు ఓట్లతో గెలిచినప్పటికి ఆమె రాష్ట్ర విభజన కోరుకోవటం పై సీమాంద్ర ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటి వరకు సీమాంత్ర నేతలెవ్వరు చేయలని సాహసం పనబాక చేయటంపై సీమాంద్ర నాయకులు మండిపడుతున్నారు. దైర్యంగా నేను రాష్ట్ర విభజనకు ఓటు వేస్తానని చెప్పటం.. ఆమెలో ఉన్న అమ్మ భక్తి ఏమిటో సీమాంద్ర ప్రజలకు తెలిసిపోయింది. ఆ దైర్యం వెనక ఉన్న అర్థం ఒక్కటే.. అమ్మ నిర్ణయానికి.. ఎదురుచెప్పకుండా నిలబడిన సీమాంద్ర మహిళ నాయకురాలుగా.. అమ్మ వద్ద 100% మార్కులు సంపాదించుకుంది. అమ్మ దయ ఉంటే.. సీమాంద్రలో కాకపోతే.. తెలంగాణలోనైన సీటు ఇచ్చి , గెలుపించుకునే సత్తా అమ్మకు ఉందనే విషయాన్ని సీమాంద్ర నాయకులకు పనభాక లక్ష్మీ గుర్తు చేసింది. అందుకే రాష్ట్ర విభజనకు సై అంటుందని సీమాంద్ర ప్రజలు అంటున్నారు. ఏమైన సీమాంద్ర నాయకులు , సమైక్యవాదన అమ్మ వినిపించటంలో విఫలమయ్యరనే విషయం అర్థమవుతుంది.
మన సీమాంద్ర నాయకులు.. తెలంగాణ ఎంపీలను చూసి నేర్చుకోవాలని సీమాంద్ర ప్రజలు కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more