సమైక్యాంద్ర కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. రాష్ట్ర విభజన కు వ్యతిరేకంగా.. చంచల్ గుడా జైల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమరణ నిరహార దీక్ష చేస్తున్నా విషయం తెలిసిందే. అయితే వైఎస్ జగన్ చేస్తున్న దీక్ష గురించి ఢిల్లీ పెద్దలకు విన్నవించుకోవటానికి ..వైఎస్ విజయమ్మ గ్యాంగ్ ఢిల్లీకు వెళ్లి, కాంగ్రెస్ పెద్దలను, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి సమైక్యాంద్ర లో జరుగుతున్న దీక్షలు, సీమాంద్ర ప్రజల మనోభావాలను చెప్పటం జరిగింది. ప్రధాన మంత్రి అయితే.. విజయమ్మ చెప్పిన మాటలకు.. ఎలాంటి సౌండ్ లేకుండా చిరునవ్వుతో..విజయమ్మను పంపించారు. అయితే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాత్రం వైఎస్ విజయమ్మ చెప్పదలచుకున్న విషయాన్ని ఆయనే ముందుగా విజయమ్మకు వినిపించి.. వైసీపీ నాయకులకు షాక్ ఇచ్చారు. అయితే ఆయన ఎలాంటి హామీ ఇవ్వలేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే వైఎస్ విజయమ్మ గ్యాంగ్ ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టింది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలో పార్టీ నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన గాడి తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేడు ఏ ఒక్కరూ సంతోషంగా లేరని ఆమె అన్నారు. వైషమ్యాలకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని విజయమ్మ వ్యాఖ్యానించారు. రాష్ట్రం అగ్నిగుండంగా మారిందని అన్నారు. తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చారని విజయమ్మ పేర్కొన్నారు. రాష్ట్ర విభజనపై సమన్యాయం చేయాలనే డిమాండ్ తోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఏవిధంగా న్యాయం చేస్తారన్నారు. రాష్ట్రం కలిసి ఉండాలని వైఎస్ఆర్ కోరుకున్నారని విజయమ్మ తెలిపారు. అన్ని ప్రాంతా అభివృద్ధికి వైఎస్ కృషి చేశారన్నారు. హైదరాబాద్ ను తెలుగువాళ్లు ఎందుకు పోగొట్టుకోవాలని విజయమ్మ ప్రశ్నించారు. మూడు ప్రాంతాల ప్రజలు కలిసి అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్ నగరాన్ని ఒక్క తెలంగాణ ప్రాంతానికే ఎలా కేటాయిస్తారంటూ వైఎస్ విజయమ్మ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్ర విభజన విషయంలో అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదనటం ఎంతవరకూ సమంజసమన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more