యానాంలో జూలై 8 ఉదయం 4.00 గంటల లోపులోనే వాకింగ్ కి వెళ్ళిన ప్రఖ్యాత సినీ నిర్మాత, ఆనంద్ రిజెన్సీ హోటల్స్ అధినేత అక్కినేని రవిశంకర ప్రసాద్ ఆచూకీ నిన తెలిసింది. నిన్న మధ్యాహ్నం మృతదేహంగా కనిపించి కుటుంబసభ్యులను దుఖ సాగరంలో ముంచెత్తారు.
తూర్పు గోదావరి జిల్లా ఐ పోలవరం లో ఆయన నడుచుకుంటూ వెళ్ళటం చూసామని కొందరు తెలియజేసారు. గోగుల్లంక దగ్గర నదిలో తుప్పల్లో గుర్తుపట్టలేని విధంగా లభించిన రవిశంకర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఆయనదేనని ధృవీకరించారు. రవి శంకర్ భార్య, రవి శంకర్ బంధువు అంజన్ కుమార్ కూడా ఆయన ఆత్మహత్య చేసుకునే అవసరమేమీ లేదని, ఆర్ధిక సమస్యలు ఎంతమాత్రం లేవని తెలియజేసారు. చక్కెర వ్యాధి ఉన్న ఆయనకు ఉదయమే నడిచే అలవాటుంది. రోడ్డు మీద ఎవరైనా వాహనంతో ఢీకొని ఆ విషయం పొక్కకుండా ఉండటం కోసం నదిలో పడవేసారేమో లేదా చక్కెర వ్యాధి వలన ఆయన పడిపోయారేమో అని అంటున్నారు.
కానీ హుటుహటిన ఆ స్థలానికి వెళ్ళిన యానాం, ముమ్మిడివరం పోలీసులకు రవిశంకర్ దేహం మీద గాయాలేమీ కనిపించలేదు. అందువలన దీన్ని అనుమానస్పదమైన కేసుగానే పోలీసులు నమోదు చేసారు.
సినిమా వ్యాపారంలో రవి శంకర్ ఎవరినీ నష్టపరచటం కానీ హాని చెయ్యటం కానీ జరగలేదని, ఆయనకి శత్రువులుండే అవకాశమే లేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కుటుంబ సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు అంతకంటే లేవని అందువలన అది హత్య కానీ ఆత్మహత్య కానీ అవటానికి అవకాశమే లేదని చెప్తున్నారు.
పోస్ట్ మార్టం జరిగిన తర్వాత చెన్నైకి తరలంచి అంత్యక్రియలను అక్కడే చేస్తామని కుటుంబ సభ్యులు తెలియజేసారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవి శంకర ప్రసాద్, శంకర్ దాదా, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలను, జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ పతాకం కింద మరెన్నో సినిమాలను నిర్మించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more