Trio stayed back at delhi

Congress Core Committee, Kiran kumar reddy, Botssa Satyanarayana, Damodara Raja Narasimha, Congress State leaders, Digvijay Singh

the trio stayed back at delhi

ఢిల్లీలోనే ఉండిపోయిన నాయకత్రయం

Posted: 07/13/2013 09:53 AM IST
Trio stayed back at delhi

విభజన మీద చర్చించటానికి కోర్ కమిటీ ఆహ్వానం మీద రోడ్ మ్యాప్ చేత పుచ్చుకుని మరీ ఢిల్లీ వెళ్ళిన ముగ్గురు కాంగ్రెస్ నాయకులు- ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ ఢిల్లీలోనే ఉండిపోయారు. 

రాష్ట్రమంతా ఉత్కంఠ రేపిన విభజన చర్చలు నిన్న సాయంత్రం నాలుగు గంటలకు ప్రధానమంత్రి నివాసంలో అనుకున్నట్టుగానే జరిగాయి కానీ ఫలితం మాత్రం శూన్యమైంది.  కోర్ కమిటీలో జరిగిందేమిటయ్యా అంటే ముగ్గురు నాయకులూ తమ తమ వాదనలను వినిపించారు- ఉప ముఖ్యమంత్రి 30 నిమిషాలు, పిసిసి అధ్యక్షుడు 40 నిమిషాలు, చివర్లో ముఖ్యమంత్రి 45 నిమిషాలు.  కోర్ కమిటీ సభ్యులు ఓపిగ్గా విన్నారు.  ఆ తర్వాత సరే మీరు ఇక వెళ్ళొచ్చు అన్నారు. 

ఆ తర్వాత మరి కొద్ది సేపు కోర్ కమిటీ చర్చలు సాగించిన తర్వాత దిగ్విజయ్ సింగ్ బయటకు వచ్చి రెండే విషయాలు ప్రకటించారు.   ఒకటి, కోర్ కమిటీ అన్ని అంశాలనూ గ్రహించిందని, రెండు, మరోసారి చర్చలు సాగించి అవసరమైతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని.  అంతే.  ఈసారి దిగ్విజయ్ సింగ్ ఎటువంటి గడువులు కాని, తీపి కబురు అందుతుందనే నమ్మకం కలిగించటం కానీ చెయ్యలేదు. 

వర్కింగ్ కమిటీని పిలవొచ్చు, ఆ తర్వాత అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలవొచ్చు, రాజ్యాంగ సవరణను కోరవచ్చు.  ఇలా ఎంత జాప్యమైనా జరగవచ్చు.  అయినా రాష్ట్రానికి తిరిగివచ్చి రాష్ట్ర ప్రజలకు ఏదో ఒకటి చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు కూడా ముగ్గురు నాయకులూ అక్కడే ఉండి మరోసారి దిగ్విజయ్ సింగ్ ని కలవబోతున్నారు.  అయితే ఈ సారి విభజన గురించేకాకుండా ఎన్నికల నేపథ్యంలో చేపట్టవలసిన కార్యకలాపాలను గురించి కూడా చర్చించుకునే అవకాశం ఉందని చెప్తున్నారు.

-శ్రీజ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more