విండీస్ లో పోర్ట్ ఆఫ్ స్పెయిల్ లో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ విజయం సాధించి టైటిల్ ని కైవసం చేసుకుంది. గాయం కారణంతో గత రెండు మ్యాచ్ లకు దూరం అయిన ధోని ఫైనల్ మ్యాచ్ లో తిరిగి జట్టులోకి వచ్చి, కూల్ గా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి నాటవుట్ గా నిలిచి జట్టును విజయ తీరీరాలకు చేర్చాడు. శ్రీలంక నిర్ధేశించిన 202 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ తొమ్మిది వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు ఉండగానే విజయాన్ని అందుకుంది. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ శ్రీలంకను బ్యాటింగ్ కి ఆహ్వానించింది. భారత స్పిన్ బౌలర్ రవీంద్ర జడేజా అద్భుత బౌలింగ్ చేసి 4 వికెట్లు తీసి లంక నడ్డి విరిచాడు. అతనికి భువనేశ్వర్, ఇషాంత్ శర్మ సహకారం అందించడంతో లంక 48.2 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాట్స్ మెన్స్ లో సంగక్కర (71) తిరిమన్నే (46) పరుగులు చేసి జట్టును గాడిలో పెట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేక పోయింది. ఓ దశలో 200 పరుగులు కూడా దాటదేమో అనిపించింది. కానీ అతికష్టంగా 200 మార్కను దాటింది.
శ్రీలంక విధించిన 202 పరుగల విజయ లక్షాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన భారత్ కి ఓపెనర్లు రోహిత్ శర్మ 58, మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఓ దశలో 167 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రైనా 32, దినేష్ కార్తీక్ 23, ధావన్ 16 పరుగులు చేసినా, ధోని 45 నాటట్ చివరి వరకు నిలవడంతో విజయం సాధ్యమైంది. ఆది నుండి కట్టుదిట్టమైన బౌలింగ్ చేసిన లంకేయులు బ్యాట్స్ మెన్స్ ను కట్టడి చేశారు. రెండు ఓవర్లలో విజయానికి 15 పరుగులు కావాల్సి ఉండగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రెండు సిక్సర్లు, ఒక ఫోర్ తో బ్యాట్ కి పని చెప్పడంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. శ్రీలంక జట్టులో హెరాత్ 4 వికెట్లు, ఎర్రంగ 2, లక్మల్, మ్యాథ్యూస్, మలింగ ఒక వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more