ఎ.పి. ఫిలించాంబర్ (ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్యమండలి) ఎన్నికలు ఈ నెల 28న జరగనున్న నేపథ్యంలో పరిశ్రమలోని వాతావరణం ఇప్పుడిప్పుడే వేడెక్కుతోంది. ఏడాదికి ఒక పర్యాయం చాంబర్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. తమ్మారెడ్డి భరద్వాజ అధ్యక్షుడిగా ఉన్న కార్యవర్గం ఏడాదికాలం పూర్తిచేసుకోవడంతో ఈ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. 2013-14 సంవత్సరానికి గాను చాంబర్ కార్యవర్గంతో పాటు చాంబర్ నాలుగు విభాగాలైన ప్రొడ్యూసర్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిబిటర్స్ సెక్టార్, డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్ కార్యనిర్వాహక సభ్యులను ఇందులో భాగంగా ఎన్నుకోబోతున్నారు.
ఈ నాలుగు సెక్టార్లకు సంబంధించిన థామాషా ప్రకారం ఒక్కోసారి ఒక్కో సెక్టార్ నుంచి చాంబర్ అధ్యక్షుడ్ని ఎన్నుకోవడం జరుగుతుంటుంది. ప్రస్తుతం పదవిలో ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ ప్రొడ్యూసర్స్ సెక్టార్ నుంచి ఎన్నిక కాగా తాజాగా జరుగుతున్న ఎన్నికలలో డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్ సభ్యుడే చాంబర్ అధ్యక్ష పదవిని అలంకరించాల్సి వుంది. మొదలైన నామినేషన్ల స్వీకరణ ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నంతో ముగియనుంది. ఈ తడవ జరిగే ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉండబోతున్నట్లు పరిశ్రమలోని వాతావరణం తేటతెల్లం చేస్తోంది. గత ఏడాది ఎన్నికలలో చిన్న నిర్మాతలది పైచేయి కావడంతో చాంబర్ కార్యవర్గం వారిచేతుల్లోకి వెళ్లింది. గత ఏడాది ప్రతిష్టాత్మకంగా దాసరి నారాయణరావు వర్సెస్ డి.సురేష్బాబుల మధ్య పోటీగా ప్రచారం జరిగింది.
అయితే ఈ తడవ చిన్న నిర్మాతలలో కొన్ని చీలికలు ఏర్పడ్డాయని, దానివల్ల చాంబర్ ఎన్నికలలో ఎవరు అంతిమ విజేతలవుతారన్న అంశం అత్యంత ఆసక్తిదాయకంగా మారిందని పరిశ్రమలో అంటున్నారు. అదీగాక ఈ తడవ దాసరి నారాయణరావు అంతగా జోక్యం చేసుకోవడంలేదన్న మాటలు కూడా పరిశ్రమలో వినిపిస్తున్నాయి. ఈ తడవ జరగబోయే ఎన్నికలలో డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్ నుంచి కేంద్ర మంత్రి చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన తిరుపతికి చెందిన యన్.వి.ప్రసాద్, వైజాగ్కు చెందిన వీరినాయుడు అధ్యక్ష పదవికోసం ప్రధానంగా పోటీ పడుతున్నట్లు తెలిసింది. అధ్యక్ష పదవితో పాటు కార్యదర్శి ఇంకా కార్యవర్గ సభ్యుల పదవులకు పోటీ జరగనుంది. మరోవైపు తెలంగాణకు చెందిన వ్యక్తికి అధ్యక్ష పదవిని ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నట్లు వినికిడి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more