కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరు ఖరారైంది. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై అభిప్రాయ సేకరణ ముగిసింది. అభిప్రాయ సేకరణఖు పరిశీలకులుగా ఎ.కె. ఆంటోనీ తో సహా నలుగురు ఏఐసీసీ ప్రతినిధులు హాజరయ్యారు. అభిప్రాయ సేకరణకు 120 మంది ఎమ్మెల్యేలు హాజరు కాగా వారిలో 103 మంది ఎమ్మెల్యేలు సిద్దరామయ్యకే అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ ఎంపీలు కూడా సిద్దరామయ్యకే మొగ్గు చూపార. ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజధాని బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నార. ఆయనతో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని పార్టీ అధిష్టానం భావిస్తోందని సమాచారం. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా నియమించిన కాంగ్రెసు పార్టీ అధిష్టానం కుల సమీకరణాలను అమలు చేయనుందంటున్నారు. లింగాయత్, కురవ, గౌడ ఫార్ములాను కాంగ్రెసు పాటిస్తోంది.
కాగా అంతకుముందు ముఖ్యమంత్రి పదవి రేసులో చాలామంది నేతలు చేరిపోయారు. సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గే తదితరులు ఈ రేసులో నిలిచారు. ముఖ్యమంత్రి పదవి రేసులో ముందంజలో ఉన్న సిద్దరామయ్య బెంగళూరులో రోజంతా బిజీబిజీగా గడిపారు. ఉదయం నుంచే ఆయన నివాసం ఎమ్మెల్యేలు, అభిమానులతో కిటకిటలాడింది. అనంతరం సీన్ ఓ ప్రైవేట్ హోటల్కు మారింది. తనకు మద్దతునిస్తున్న దాదాపు డెబ్బై మంది ఎమ్మెల్యేలతో సిద్దరామయ్య రహస్య సమాలోచనలు జరిపారు. ఎన్నికలో ఓడిపోయినంత మాత్రాన తనను తక్కువ అంచనా వేయొద్దని, తాను ఇప్పటికీ ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నానని కెపిసిసి చీఫ్ పరమేశ్వర ప్రకటించడం విశేషం. అయితే చివరకు ముఖ్యమంత్రి పదవి సిద్దరామయ్యను వరించింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా సిద్దరామయ్యకే పదవి ఇవ్వాలనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కర్ణాటకలో జరిగిన రహాస్య ఓటు విషయాన్ని ఫోన్ ద్వారా ఎ.కే ఆంటోనీ సోనియాగాంధీ కి చెప్పినట్లు మీడియా వర్గాల సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more