తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంటులోపల బయటా కూడా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం ఆందోళనలు చేపట్టారు. కాంగ్రెస్ సభ్యులయ్యుండీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చెయ్యటమనేది అధిష్టానం దృష్టిలో సమంజసమైతే కాదు. రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న పథకాల మీద ఆరాతీసి, ప్రతిపక్షాల మీద ఎవరెవరు విరుచుకుపడుతున్నారో వాళ్ళ హాజరు పట్టీలను తయారు చేసుకుంటూ, ఏమీ మాట్లాడకుండా ప్రతిపక్షాలను దుయ్యబట్టకుండా మిన్నకున్నవాళ్ళ మీద కూడా గుర్రుగా ఉన్న అధిష్టానం, వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని క్షమించటం కష్టమే.
కానీ తెలంగాణా ప్రజల ముందు తలెత్తుకుని తిరగాలంటే తెలంగాణా రాష్ట్రం కోసం పాటుపడుతున్న ముద్ర వేసుకోవలసిందే. ఈవిషయాన్ని తెలంగాణా కాంగ్రెస్ నాయకులు అధిష్టానానికి వివరించేవుంటారు. తెలంగాణా ప్రాంతంలో తిరగలేని పరిస్థితిని తెచ్చుకుంటే పార్టీ కోసం ఏం చెయ్యగలమని కూడా వారు అడిగేవుంటారు. అందుకే ధైర్యంగా, కెసిఆర్ బలం పుంజుకుంటున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు కూడా ముఖంలో కొంత గాంభీర్యాన్ని చూపించాలీ అంటే అందరికీ తెలిసేట్టుగా తెలంగాణా కోసం కృషిచేస్తున్న కాంగ్రెస్ నాయకులుగా కన్పించటం అవసరమని కూడా అధిష్టానానికి వివరించివుండవచ్చు.
నిన్న పార్లమెంటులో ఆందోళన సాగించిన తెలంగాణా ప్రాంత పెద్దపల్లి నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడు జి.వివేకానంద మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణా రాష్టం కంటే ఏమాత్రం తక్కువ ఒడంబడికనూ మేము సమర్ధించమని చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రయోజనంలో చూసినా అవసరమే అని ఆయన అన్నారు. అదే సందర్భంలో బయ్యారం గనులను విశాఖ స్టీల్స్ కి ఇచ్చే నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ని కూడా ఆయన తప్పు పట్టారు. ప్రధాన మంత్రి కలుగజేసుకుని ఆ జీవోని రద్దు చెయ్యవలసిన అవసరం ఉందని కూడా వివేకానంద అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో స్టీల్ మినిస్టర్ బేణీ ప్రసాద్ వర్మ ను కూడా కలిసామని, రాష్ట్ర ప్రభుత్వం 5000 ఎకరాలు ఇచ్చినట్లయితే అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టటానికి అవకాశం ఉంటుందని ఆయన చెప్పారని ఎంపీలు చెప్పారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more