ఇప్పటిదాకా కిరణ్ కుమార్ రెడ్డి నా మిత్రుడు.. ఇక ముందు జగన్ నాకు మంచి మిత్రుడు, రాష్ట్రంలో కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తాం, ఇప్పటికే కాంగ్రెస్ 50 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాలు కోల్పోయిందని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మజ్లిస్ పార్టీ కొత్త మంత్రం జపిస్తుంది. మొన్న.. అక్బర్ హిందు మతం పై వివాస్పదా వ్యాఖ్యాలు చేసి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆ విషయం మరిచిపోకముందే ఆ పార్టీ ఎమ్మెల్యే పాషా ఖాద్రీ జాతిపిత మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేవలం ముస్లింల సానుభూతి కోసమే ఆ పార్టీ నాయకులు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ నాయకులు అంటున్నారు. అసలు పాషా ఖాద్రి వ్యాఖ్యల వెనుక ఉన్న అర్థం ఏమిటి? నిజాం కట్టించిన అసెంబ్లీలో కూర్చుంటూ జాతిపిత విగ్రహం ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ఎవరి జాగీరు అని మండిపడ్డారు. దేశంలోని చారిత్రక కట్టడాలన్నీ నిజాంలు, ముస్లీం ప్రభువులు నిర్మించినవే అని, హిందూస్థాన్ నేతలు ఏమి చేశారని మరో వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్యలను ఖాద్రి ఉద్దేశ పూర్వకంగానే చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా ఒకరి వెనుక ఒకరుగా ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్టు అయితే ముస్లిం మైనారీటలను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వేదిస్తున్నదని , అందుకే ఇలా అరెస్టులు చేస్తున్నారన్న ప్రచారాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ , చుట్టుపక్క జిల్లాలలో, కొన్ని రాయలసీమ జిల్లాలలో బలంగా ముందుకు తీసుకెళ్లి ముస్లిం మైనారీటల ఓట్లు ఏకపక్షంగా సాధించటం ద్వారా కాంగ్రెస్ ను దెబ్బ తీయాలన్న వ్యూహంతో మజ్లిస్ నాయకత్వం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అక్బరుద్దీన్ హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే పాషా ఖాద్రి ఏకంగా భారత సార్వభౌమత్వాన్ని ప్రశ్నించి, విధిలేని పరిస్థితిలో హైదరాబాద్ లో సంస్థానాన్ని విలీనం చేసిన నిజాం నవాబును తలకెత్తుకున్నారు. ఖాద్రి తన ప్రసంగంలో హిందూస్థాన్ అనే మాట వాడటం ద్వారా అసలు ఈ దేశంతో ముస్లింలకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి మజ్లిస్ నాయకత్వం అంత దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరం లేదని ముస్లిం నాయకులు అంటున్నారు.
అన్నదమ్ములను ఎన్ని సార్లు ఎమ్మెల్యేలుగా గెలిపించినా పాతబస్తీ ముస్లీంల జీవన స్థితిగతులు బాగుపడటంత లేదన్న నిజాన్ని పాతబస్తీ ప్రజానీకం తెలుసుకుంటున్నారు. మజ్లిస్ పార్టీ నుంచి ఉన్నత విద్య అభ్యసిస్తున్న యువతీయువకులు క్రమంగా దూరం అవుతున్నారు. అక్బర్ అరెస్ట్ తో పాతబస్తీ జనం తిరుగుబాటు చేస్తారని ఆశించిన మజ్లిస్ నాయకత్వానికి అనుకొని దెబ్బతగిలింది. పాషా ఖాద్రి ఇంత బాహాటంగా జాతిపిత మహాత్మా గాంధీని విమర్శించి, చివరకు శాసనసభ పవిత్రతను సైతం అప్రతిష్టపాలు చేసేలా నిజాం నవాబుకు మద్దతు ఇస్తే ఆయనపై ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోలేదు. దీనిపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. ఒకవైపు హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు అక్బరుద్దీన్ ను అరెస్టు చేసి, పాషా ఖాద్రి విషయంలో అధికార యంత్రాంగం అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తుందని బీజేపి లాంటి రాజకీయ పార్టీ సైతం మౌనం వహించటం మరింత ఆశ్చర్యం కలిగిస్తుందని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. ప్రభుత్వం ఎప్పుడు చర్యలు తీసుకుంటుందో చూడాలి.. పాషా ఖాద్రి చేసిన వ్యాఖలకు గాంధీ జీ సైతం మౌనంగా చూస్తున్నాడు? చివరకు గాంధీ మీద విమర్శలు చేసిన పట్టించుకొనే నాయకుడు లేనప్పుడు గాంధీ మాత్రం ఏం చేస్తాడు? దేశంలో పరిస్థితులు ఇలా ఉన్నాయా? అని గాంధీ సైతం తెలుసుకోని , పాషా ఖాద్రిని క్షమించి ఉంటాడు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more