స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన జరిగిన 13 రాష్టప్రతి ఎన్నికల్లో 1969 నాటి ఎన్నిక తనకు చిరకాలం గుర్తుండి పోతుందని బిజెపి సీనియర్ నేత ఎల్కె అద్వానీ స్పష్టం చేశారు. 14వ రాష్టప్రతి ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఇంతకుముందు జరిగిన రాష్టప్రతి ఎన్నికలకు సంబంధిచి తన బ్లాగులో విశే్లషించారు. 1969లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తమ అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డి పేరును ప్రతిపాదించారు. నామినేషన్ వేసిన తరువాత అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు చేయవలసిందిగా ఇచ్చిన పిలుపుసంజీవరెడ్డి ఓటమికి దారితీసింది. ఇండిపెండెంటుగా పోటీ చేసిన వరాహగిరి వెంకటగిరి ఘన విజయం సాధించారు. సంజీవరెడ్డి పరాజయానికి ముందు, ఆ తరువాత అత్యంత ఉత్కంఠ భరితమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయని అద్వానీ గుర్తుచేసుకున్నారు.
అధికార అభ్యర్థిగా ఓడిపోయిన సంజీవరెడ్డి ఎమర్జెన్సీ ముగిసిన తరువాత జరిగిన ఎన్నికల్లో లోక్సభకు జనతా పార్టీ అభ్యర్థిగా ఎన్నికై రాష్టప్రతిగా ఏకగ్రీవం అయిన విషయం బిజెపి సీనియర్ నేత అన్నారు. సంజీవరెడ్డి తప్పించి ఇప్పటివరకూ రాష్టప్రతి పదవికి ఏకగ్రీవ ఎన్నిక జరగలేదని ఆయన తెలిపారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకురాలు సోనియాగాంధీతో సహా మిగిలిన రాజకీయ పార్టీలతో చర్చించి అబ్దుల్ కలామ్ను రాష్టప్రతి పోటీకి ఎంపిక చేశారు. అయితే వామపక్షాలు తమ అభ్యర్థిగా లక్ష్మీసైగల్ను దించటంతో పోటీ తప్పలేదు. యుపీఏ వ్యవహరించిన తీరు మూలంగానే రాష్టప్రతి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేందుకు వీలులేకుండా పోయిందని అద్వానీ విమర్శించారు. ఈ విషయంలో బిజెపిని తప్పు పట్టడం సరైంది కాదన్నారు. ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తరువాత ప్రధాని మన్మోహన్ సింగ్ తనకు ఫోన్ చేసినప్పుడు ఎంపికకు ముందు ప్రతిపక్షాలతో మాట్లాడి ఉంటే బాగుండేది కదా? అని ప్రశ్నించినట్లు ఆయన వెల్లడించారు. ప్రధాని మాట్లాడిన కొద్దిసేపటికి ప్రణబ్ ఫోన్ చేసి తన పేరు ఖరారైనట్లు చెప్పారే తప్పించి మద్దతు కోరలేదని అద్వానీ అన్నారు. తమకు తగినంత సంఖ్యాబలం ఉంది కాబట్టే రాష్టప్రతి ఎన్నికల్లో ప్రతిపక్షాల సాయం తీసుకోకుండా కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అద్వానీ దుయ్యబట్టారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more