తాను, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిన్న పిల్లల్లా కొట్లాడుకుంటున్నారన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు మాకు మాస్టర్ లాగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన నుండి మేం రాజకీయ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని ధ్వజమెత్తారు. ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. బాబు స్కూల్లో అన్నీ ప్రజా వ్యతిరేక పాఠాలే ఉంటాయని చెప్పారు.
అందుకే ఆయన పాఠాలు తమకు అవసరం లేదని చెప్పారు. మేం ప్రజలకు దగ్గరయ్యేలా ఉంటున్నామని, కానీ ఆయన పాఠాలు మాత్రం ప్రజలకు చెక్ చెప్పేలా ఉంటాయని విమర్శించారు. అలాంటి పాఠాలు మాకు అవసరం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు పార్టీ నాయకుడే అన్నారు. ఆయన ఫోటోను మేం ఉపయోగించుకుంటామని చెప్పారు. ఉప ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల లోపు రావొచ్చు లేదా రాకపోవచ్చునని చెప్పారు. ఉప ఎన్నికలు ఎన్నికల సంఘం చేతిలో ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పారు. త్వరలో స్థానిక ఎన్నికలు ఉంటాయని చెప్పారు. తిరుపతి నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ తరఫున మంచి అభ్యర్థిని పరిశీలించి త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. టిక్కెట్లు ఆశించే వారు ఎక్కువగా ఉండటంతో అభ్యర్తి ఎంపికలో జాప్యం జరుగుతోందన్నారు. జరగబోయే ఉప ఎన్నికలలో అభివృద్ధే తమ ప్రధాన ప్రచార అజెండా అని చెప్పారు. అత్యధిక స్థానాలు కాంగ్రెసు పార్టీ సొంతం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more