మధ్యప్రదేశ్లో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల పంపకాలు వ్యవహారంతో విసిగివేసారిన ఓ ఆశావహుడు ప్రాణాలపైకి తెచ్చుకున్నారు. పార్టీ అధిష్టానం తనకు టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆశావహుడు.. పార్టీ రాష్ట్రస్థాయి నేత మాధవరావు సింధియా ఎదుటే విషం మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే పార్టీ కోసం తాను ఎంతోకాలంగా కష్టపడి పనిచేస్తుంటే.. తనకు టికెట్ కేటాయించపోవడంపై ఆయన తన నిరసనను ఇలా వ్యక్తం చేశారు.
అక్కడే వున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఆయనను హుటాహుటిన అస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. గ్వాలియర్ కు చెందిన కాంగ్రెస్ నేత, జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ అయిన ప్రేమ్సింగ్ కుస్వాహ.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. పార్టీని కాపాడుకుంటూ.. కార్యకర్తలకు నిత్యం అండగా నిలుస్తూ వచ్చిన తనకు అసెంబ్లీ బరిలో నిలిచే అవకాశం కల్పించకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
ఆయన అభ్యర్థనను తిరస్కరించిన కాంగ్రెస్ అధిష్ఠానం దక్షిణ గ్వాలియర్ సీటును సురేశ్ చౌదరికి కేటాయించింది. తనకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రేమ్సింగ్.. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలను బహిరంగంగా ప్రజావేదికలపైనే తిట్టేసి.. ఏడాదిన్నర క్రితం కాంగ్రెస్ లోకి వచ్చిన బీఎస్పీ నేతలకు అవకాశం కల్పించడమేంటని నిలదీసిన ఆయన మాధవరావు సింధియా విగ్రహం ఎదుట విషం తీసుకున్నారు. సకాలంలో నేతలు స్పందించి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. కాగా, దక్షిణ గ్వాలియర్ లేదంటే తూర్పు గ్వాలియర్ నుంచి తనకు టికెట్ ఇవ్వాల్సిందేనని గత కొంత కాలంగా ప్రేమ్ సింగ్ డిమాండ్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more