స్టార్ షట్లర్, తెలుగుతేజం పి.వి.సింధు భారత అత్యుత్తమ క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్రత్న రేసులో మరోసారి నిలిచింది. గత ఏడాది నుంచి ఈ ఏడాది వరకు పలు టార్నోమెంట్లలో తన ప్రతిభను కనబర్చిన పీవీ సింధు.. పలు విజాయాలను సోంతం చేసకుంది. తన సీనీయర్ ఏస్ షెట్లర్ సైనా బాటలోనే పయనిస్తూ.. మున్ముందుకు దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో బ్యాడ్మింటన్ సమాఖ్య సింధు పేరును ఖేల్ రత్న అవార్డకు సిఫార్సు చేసింది. పీవీ సిందూతో పాటుగా హాకీ జట్టుకు చెందిన కెప్టెన్ సర్దార్ సింగ్ పేరు కూడా ఈ ఏడాది అవార్డు కోసం పరిశీలనతో వుంది. వీరిద్దరూ ఇప్పటికే తమ ధరఖాస్తునలు క్రీడా మంత్రిత్వ శాఖకు పంపించారు.
వీరితో పాటు ఆగస్టు 29న హకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని క్రీడారంగాలను చెందిన ప్రముఖులకు అందించే అత్యుత్తమ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులకు ఏసియన్, కామన్ వెల్త్ గేమ్స్ మెడలిస్టు టింటూ లూక (అథ్లెటిక్స్), ఇంచియాన్ స్వర్ణ పతాక విజేత దీపికా పల్లికల్ (స్క్వాష్), ఇంచియాన్ రజత పతక విజేత గిరీష హోసనగర (పారాలింపిక్స్) పేర్లను తొలిసారిగా ఖేల్ రత్న అవార్డలకు ప్రతిపాదించారు. వీరితో పాటు జీవ్ మిల్కాసింగ్ (గోల్ఫ్), దేవేంద్ర జజారియ (పారాలింపిక్స్) కూడా పోటీపడనున్నారు. సింధు, జీవ్, దేవేంద్ర నిరుడూ ఖేల్రత్న రేసులో నిలిచారు. ఐతే.. కపిల్దేవ్ నేతృత్వంలోని అవార్డుల కమిటీ ఎవరినీ ఎంపిక చేయలేదు.
కాగా ఈ సారి రాజీవ్ ఖేల్ రత్న అవార్డులకు ఎవరి పేరును బీసీసీఐ ప్రతిపాదించలేదు. కాగా క్రీడాకారులకు అభించే అత్యున్నత పురస్కారం అర్జున అవార్డుకు గత ఏడాది రెండు పర్యాయాలు డబుల్ సెంచరీలతో అదరగోట్టిన రోహిత్ శర్మ పేరును ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more