థాయ్లాండ్ మాస్టర్స్లో మంచి ప్రదర్శన చేసి ర్యాంకింగ్ మెరుగుపరుచుకోవాలనుకున్న భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్కు నిరాశే మిగిలింది. ఇండోనేషియా క్రీడాకారుడు షెసర్ హిరెన్ చేతిలో ఓడి తొలి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టాడు. 48 నిమిషాలు పాటు సాగిన మ్యాచ్లో రెండో సీడ్ కిదాంబి ప్రత్యర్థి చేతిలో 21-12, 14-21, 12-21 తేడాతో ఓటమిపాలయ్యాడు. తొలుత ఆధిపత్యం చెలాయించి తొలి గేమ్ను సొంతం చేసుకున్న తర్వాత గేమ్స్ల్లో కిదాంబి తేలిపోయాడు. తొలి రౌండ్లోనే అతడు టోర్నీల నుంచి నిష్క్రమించడం వరుసగా ఇది మూడో సారి.
థాయ్లాండ్ మాస్టర్స్లో మరో భారత షట్లర్ సమీర్వర్మ కూడా తొలిరౌండ్లోనే నిష్క్రమించాడు. లీ జి జియా (మలేషియా) చేతిలో సమీర్ 16-21, 15-21 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. భారత షట్లర్లు సైనా నెహ్వాల్, ప్రణయ్ లు కూడా తొలి రౌండ్ లోనే తమ పోరును ముగించేశారు. ప్రణయ్ రాయ్ తన ప్రత్యర్థితో మలేషియా కు చెందిన లివ్యూ డారెన్ తో కాసింత సేపు గట్టిగానే పోరాడినా.. అది అతడిని మరో రౌండ్ కు పంపేందుకు దోహదపడలేదు. ఫలితంగా ప్రత్యర్థి చేతిలో 17-21, 22-20, 19-21 ఓడిపోయాడు.
ఇక భారత్ నుంచి పోరులో నిలిచిన ఒంటరి మహిళా క్రీడాకారణి సైనా నెహ్వాల్ కూడా తొలి రౌండ్ లోనే ప్రత్యర్థి లైన్ హోజ్ మార్క్ (డెన్ మార్క్) చేతిలో 13-21, 21-17, 15-21 ఓటమిని చవిచూసి తిరుగుముఖం పట్టారు. దీంతో థాయ్ లాండ్ మాస్టార్స్ లో భారత్ నిష్క్రమించింది. దీంతో టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించే అవకాశాలను కూడా సైనా, శ్రీకాంత్ కోల్పోయారు. ఏప్రిల్ 26 లోపు ర్యాంకింగ్స్లో తొలి 16 స్థానాల్లో ఉండివుంటే వారికి అవకాశం లభిస్తోంది. ప్రస్తుతం సైనా 22వ, శ్రీకాంత్ 26వ ర్యాంకుల్లో ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more