ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ స్క్వాష్లో భారత్కు రెండు పతకాలు వచ్చాయి. భారత స్క్వాష్ క్వీన్స్ దీపిక పల్లికల్ , జోష్న చిన్నప్ప ఏషియాడ్లో కాంస్య పతకాలతోనే సరిపెట్టుకున్నారు. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన దీపిక,జోష్న మహిళల సింగిల్స్ విభాగాల్లో బ్రాంజ్ మెడల్కే పరిమితమయ్యారు. మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో స్వర్ణం సాధిస్తుందనుకున్న దీపిక పల్లికల్ స్థాయికి తగ్గట్టుగా రాణించడంలో విఫలమవ్వగా...రెండో సెమీఫైనల్ మ్యాచ్లో జోష్న పోరాడి ఓడింది.
తొలి సెమీస్లో మలేసియా క్రీడాకారిణి నికోల్ యాన్ డేవిడ్..దీపికాపై పూర్తిస్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. వరుసగా మూడు గేమ్స్లోనే భారత స్టార్ను చిత్తు చేసింది. ఏకపక్షంగా ముగిసిన పోరులో స్థాయికి తగ్గట్టుగా రాణించడంలో విఫలమైన దీపిక 0-3తో ఓడి బ్రాంజ్ మెడల్ మాత్రమే దక్కించుకోగలిగింది. ఈ మ్యాచ్లో నెగ్గిన నికోల్ యాన్ ఫైనల్కు అర్హత సాధించింది. మరో సెమీఫైనల్లో జోష్న చిన్నప్ప ఫైనల్ బెర్త్ కోసం పోరాడింది.
ఆధ్యంతం ఆసక్తికరంగా సాగిన పోరులో మలేసియా క్రీడాకారిణి శివసంగారి సుబ్రహ్మణ్యం జోష్నపై,పై చేయి సాధించింది. 3-1తో జోష్నను ఓడించి ఫైనల్ చేరింది.ఉమెన్స్ స్క్వాష్ సింగిల్స్ సెమీస్లో హాట్ఫేవరెట్స్గా బరిలోకి దిగిన దీపిక,జోష్నలకు చెక్ పెట్టిన ఘనత మలేసియన్ క్రీడాకారుణులకే దక్కింది. 2014 ఇంచియాన్ ఆసియా గేమ్స్ స్క్వాష్ ఉమెన్స్ సింగిల్స్లోనూ కాంస్యం నెగ్గిన దీపిక పల్లికల్కు ప్రస్తుత గేమ్స్లోనూ బ్రాంజ్ మెడల్ మాత్రమే దక్కడం విశేషం.స్క్వాష్లో వచ్చిన రెండు పతకాలతో 18వ ఏషియాడ్ మెడల్స్ టేబుల్లో భారత పతకాల సంఖ్య 27కు చేరింది.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more