ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా క్రీడల్లో టెన్నిస్ విభాగంలో భారత్ పతకం ఖాయం చేసుకుంది. మహిళల సింగిల్స్ లో భారత క్రీడాకారిణి అంకిత రైనా సెమీస్ చేరింది. దీంతో ఆమెకు పతకం ఖరారైంది. పోటీల్లో భాగంగా ఇవాళ అంకిత క్వార్టర్ ఫైనల్ లో హాంకాంగ్ క్రీడాకారిణి వాంగ్ చాంగ్ తో తలపడి విజయాన్ని అందుకుని సెమీస్ కు దూసుకెళ్లి పతకాన్ని ఖాయం చేసుకుంది.
హాంకాంగ్ క్రీడాకారిణి వాంగ్ చాంగ్ తో జరిగిన మ్యాచ్ లోని తొలిసెట్ లో ఒకానొక దశలో 1-4తో బాగా వెనకబడిపోయింది అంకిత. ఆటలో అన్ని సాధ్యమే అనుకుని వెనుకబడినా ముందుకురావచ్చునన్ని పట్టుదల, అంకుఠిత దీక్షా, ఏకాగ్రతలతో ఒత్తిడిని అధిగమించింది. మ్యాచ్పై ఏమాత్రం పట్టు విడవకుండా వీరోచితంగా పోరాడింది. దీంతో 4-4తో తొలి సెట్ను సమం చేసింది. ఆ తర్వాత ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వకుండా 6-4తో మొదటి సెట్ను సొంతం చేసుకుంది.
రెండో సెట్ లోనూ అంకిత మరింత జోరు పెంచింది. ఏకంగా రెండో సెట్ ను 27 నిమిషాల్లోనే ముగించేసింది. తన ప్రత్యర్థి వాంగ్ చాంగ్ ను 6-1తో మట్టికరిపించి సెమీఫైనల్ కు బర్త్ ను కన్ఫామ్ చేసుకుని పతకాన్ని రిజర్వు చేసుకుంది. దీంతో ఆసియా క్రీడల్లో అంకితకు పతకం ఖాయమైంది. 25 ఏళ్ల అంకిత రైనా గుజరాత్ వాసి. మరోపక్క పురుషుల డబుల్స్ లో రోహన్ బొప్పన్నా, దివిజ్ శరణ్ ల జోడీ కూడా సెమీస్ కు చేరి పతకాన్ని రిజర్వు చేసుకుంది. చైనీస్ తైపీ హైక్ చెంగ్ పింగ్ లయద యాంగ్ సాంగ్ హ్వా జోడీలను 6-3, 4-6, 3-6లతో ఓడించి సెమీస్ చేరింది. దీంతో భారత్ కు ఆసియా క్రీడల్లో టెన్నిస్ విభాగంలో మరో రెండు పతకాలు ఖాయంగా రానున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more