ఆస్ట్రేలియన్ ఓపెన్ లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ సైనా నెహ్వాల్.. పోరు ముగిసింది. శుక్రవారం జరిగిన క్వార్ట్రర్ పోరులో సైనా నెహ్వాల్ తన ప్రత్యర్థి క్రీడాకారిణి ప్రపంచ ఐదవ సీడ్ క్రీడాకారణి చైనాకు చెందిన వాంగ్ షియాన్ చేతిలో పరాజయం పాలైంది. తొలి సెట్ నుంచి సైనా తన ప్రదర్శనను రక్తి కట్టించలేకపోయింది. ప్రి క్వార్ట్రర్ పోరులో సైనా నెహ్వాల్ తన ప్రత్యర్థి క్రీడాకారిణి ప్రపంచ 9వ ర్యాంకర్ సున్ యు (చైనా)ను 21-19, 19-21,21-14 తేడాతో ఓడించి అస్ట్రేలియా ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్ కు చేరిన సైనా.. సిడ్నీ ఒలంపిక్ పార్కులో ఇవాళ జరిగిన మ్యాచ్ లో.. వాంగ్ షియాన్ చేతిలో 15-21, 13-21 తేడాతో ఓటమి పాలైంది. డించి అస్ట్రేలియా ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్ కు చేరింది.
దీంతో ఈ ఇద్దరి క్రీడాకారుణుల ముఖాముఖి రికార్డు సైనా ఓటమితో సమంగా చేసుకున్నట్లు అయ్యింది. ఇప్పటి వరకు వీరిద్దరి మద్య 11 మ్యాచ్ లు జరగ్గా.. ఇదివరకే ఆరింటిలో గెలచి సైనా.. ఈ ఓటమితో ప్రత్యర్థి క్రీడాకారిణి కూడా అదే స్థాయిలో విజయాలను నమోదు చేసుకునేట్లు చేసింది. సైనా నెహ్వాల్ ప్రదర్శన తీరుపట్ల అమె అభిమానులు నిరుత్సాహం చెందుతున్నారు. కాగా, సైనా ఓటమితో భారత్ పోరు ముగిసినట్లు అయ్యింది. గురువారం కిదాంబి శ్రీకాంత్ సహా గుత్తాజ్వాల, అశ్వనీ పోన్నప్ప కూడా ఓటమిని చవిచూసి వెనుదిరిగారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more