నాలుగేళ్లకోసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఒలంపిక్స్ క్రీడలను నిర్వహించాలంటే అంతా ఆషామాషీ విషయం కాదు. వీటిని నిర్వహించిన సదరు దేశం ఆర్థికపరంగా లాభాన్ని ఆర్జించే అవకాశం వుంది కానీ.. అంతకంటే ముందు దేశవిదేశాల నుంచి వచ్చే క్రీడాకారులు, ఆ దేశ రాజకీయ నాయకులు, ఇంకా సర్వత్ర కార్యక్రమాలను నిర్వహించాలంటే తడిసి మోపెడవుతుంది. ఇంతా భారీ ఖర్చుతో కూడిన ఈ క్రీడలను 2024లో భారత్ లో నిర్వహించనున్నట్లుగా గతకొన్నాళ్ల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇప్పటికే ఎన్నో నష్టాల్లో కూరుకుపోయిన భారత్.. ఇంతటీ ఖరీదైన క్రీడలను నిర్వహిస్తుందా? అసలు ఇది నిజమేనా? అంటూ అందరూ డైలమాలో పడిపోయారు. దీనిపై మోడీ నిర్ణయం ఏంటి? అని ఒకటే ప్రశ్నలు వెల్లువెత్తాయి. చివరికీ మోడీ ఆ ప్రశ్నల చిక్కుముడి తెరను దించేశారు. 2024 ఒలంపిక్స్ నిర్వహిణకు తాము ఆసక్తి చూపడం లేదని ప్రధాని మోడీ స్పష్టం చేసినట్లు అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ వెల్లడించారు.
ఐఓసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భారత్ వచ్చిన బాచ్.. సోమవారం సాయంత్రం ప్రధాని మోడీ అధికారిక నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే ఒలంపిక్ నిర్వహణ విషయంపై చర్చించగా.. వాటి నిర్వహణ గురించి వస్తున్న వార్తలను ప్రధాని ఖండించినట్లుగా బాచ్ స్పష్టం చేశారు. ఈ వార్తలు విన్న అనంతరం ఐఓసీ కూడా షాకైనట్లుగా ఆయన తెలిపారు. గతేడాదే ఏర్పడిన భారత్ ఒలంపిక్ సమాఖ్య ఈ ప్రతిష్టాత్మక క్రీడలను సమర్థంగా నిర్వహించలేదని, దానికి ఇంకా సమయముందని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం.. మోడీతో తన సమావేశం అద్భుతంగా జరిగిందని ఆయన వర్ణించారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more