బ్యాడ్మింటన్ లో తన మెరుగైన ఆటతీరుతో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించినా తన పేరును పద్మభూషణ్ అవార్డుకు తన పేరును ఎందుకు పంపలేదని సైనా నెహ్వాల్ ఆవేదనను వ్యక్తం చేసింది. దేశం తరఫున మంచి ప్రదర్శనలు చూపించినా.. అనేక కప్పులను సాదించి దేశ కీర్తని నలుదివలా ఇనుమడింపజేసినా.. తన పట్ల కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఎందుకు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తుందని అన్నారు. గత సంవత్సరం ఆగస్టులో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) సైనా పేరును క్రీడా మంత్రిత్వశాఖకు పంపింది. కానీ, క్రీడా శాఖ మాత్రం సైనా పేరును పక్కన పెట్టి.. ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన రెజ్లర్ సుశీల్ కుమార్ పేరును హోం శాఖకు ప్రతిపాదించింది.
దీనిపైనే సైనా స్పందించింది. ''సుశీల్ కుమార్ పేరును ప్రత్యేకంగా పద్మ అవార్డుకు పంపినట్లు తెలిసింది. నా పేరు మాత్రం పంపలేదు. రెండు పద్మ అవార్డుల మధ్య రెండేళ్ల తేడా ఉండాలన్నది మంత్రిత్వశాఖ నిబంధన అని చెబుతున్నారు. అయినా అతడి పేరు పంపారు గానీ, నా పేరు మాత్రం పంపలేదు. నాకు ఐదేళ్ల తేడా ఉన్నా పంపనందుకు చాలా బాధగా ఉంది" అని సైనా చెప్పింది.
గత సంవత్సరం కూడా ఇవే కారణాలతో తన దరఖాస్తు తిరస్కరించారని.. ఈసారి దరఖాస్తు చేసినా ఫలితం లేదని అంటోంది. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడానని, వాళ్లు మాత్రం ఇప్పటికే సుశీల్ పేరు వెళ్లిపోయినట్లు చెప్పారని సైనా తెలిపింది. తామిద్దరికీ ఒలింపిక్స్లో పతకాలు వచ్చాయని, అలాంటప్పుడు తనకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించింది. ఆమెకు ఇంతకుముందు 2010లో రాజీవ్ ఖేల్ రత్న, పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. 2009లో అర్జున అవార్డు కూడా వచ్చింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more