సెప్టెంబర్ 19న డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ తో తొలి మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ తలపడటం ఇక ఖాయమైంది. అయితే ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించినా అందుకు కారణం మాత్రం మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీయేనని సమాచారం. కోవిడ్ నేపథ్యంలో ఆటగాళ్లు ఎక్కువ రోజులు క్వారంటైన్ లోనే ఉన్నారు. సరైన సన్నద్ధత లేదు.. దీనికి తోడు కీలక ఆటగాళ్లు లేరు.. ఇద్దరు క్రికెటర్లు కరోనా బారిన పడినా చెన్నై సూపర్ కింగ్స్ 19న ఐపీఎల్ కు కిక్ స్టార్ట్ ఇచ్చేందుకు మొగ్గుచూపడానికి కారణం.. మిస్టర్ కూల్ ధోనియే. రిస్క్ లేనిదే.. ఏదీ లేదని భావించే ధోనియే ఇందుకు గగ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఇలా షెడ్యూల్ ఫిక్స్ అయ్యిందని తెలిసింది.
అంతకుముందు కోహ్లీ, దినేశ్ కార్తీక్ చిత్రాన్ని ఐపీఎల్ ట్విట్టర్ లో ఉంచగా.. ఇక దానికి క్యాప్షన్ కూడా ‘మరో 14 రోజుల్లో..’ అంటూ వారు షేర్ చేసుకోవడంతో సీఎస్కే ముంబై ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ జరగదని రమారమి అందరూ అనుకున్నారు. కోల్కతా, బెంగళూరు మధ్య ఆరంభమ్యాచ్ జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎంఎస్ ధోనీ తీసుకున్న అనూహ్య నిర్ణయం వల్లే మొదటి మ్యాచులో చెన్నై ఆడుతోందట. వాస్తవంగా సెప్టెంబర్ 19 లేదా 23న తొలి మ్యాచ్ ఆడేందుకు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ సీఎస్కే అవకాశం కల్పించారని తెలిసింది. ఐదు రోజులు వెసులుబాటు దొరికితే సాధన చేసేందుకు సమయం దొరుకుతుందని అలా చేశారు.
ఎంఎస్ ధోనీ మాత్రం ఇందుకు ఒప్పుకోలేదని సమాచారం. కెరీర్లో ఎన్నోసార్లు సాహసాలు చేసిన అతడు మరోసారి కఠిన నిర్ణయానికే మొగ్గుచూపాడు. సమయం సరిపోకున్నా సెప్టెంబర్ 19నే తొలి మ్యాచులో తలపడతామని చెప్పాడట. ఇలా చేయడం వల్ల మొదటి ఆరు రోజుల్లోనే సీఎస్కే మూడు మ్యాచులు ఆడాల్సి వస్తుంది. విశ్రాంతి తీసుకొనే సమయమూ దొరకదు. అయినా రిస్క్ చేసేందుకే ‘మిస్టర్ కూల్’ పట్టుదలగా ఉన్నాడని తెలిసింది. ఆటగాళ్లూ విపరీతమైన ఆత్మవిశ్వాసంతో ఉన్నారని ఐపీఎల్ వర్గాలు అనుకుంటున్నాయి. ఇప్పటికే రైనా, హర్భజన్ సింగ్ లేడు. మరి ధోనీ నిర్ణయ ఫలితాలు ఉంటాయో కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. అబుదాబి వేదికగా సెప్టెంబర్ 19న ముంబయి ఇండియన్స్, షార్జా వేదికగా 22న రాజస్థాన్ రాయల్స్, దుబాయ్ వేదికగా 25న ఢిల్లీ క్యాపిటల్స్ తో చెన్నై సూపర్కింగ్స్ తలపడనుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more