అతిధ్యజట్టు న్యూజీలాండ్ తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన రెండో వన్డే లోనూ భారత జట్టు జైత్రయాత్ర కొనసాగించింది. న్యూజీలాండ్ పై ఏకంగా తొంబై పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. మౌంట్ మాంగనూయి మైదానం వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా జట్టు బ్యాటింగ్ ను ఎంచుకుని న్యూజీలాండ్ బౌలర్లపై వీరవిహారం చేసింది. లక్ష్యచేధనలో చతికిలపడిన కివీస్ 234 స్కోరుకే చాపచుట్టేశారు. దీంతో రెండో మ్యాచ్ లోనూ టీమిండియా ఘనవిజయాన్ని నమోదు చేసింది.
న్యూజీలాండ్ తో జరిగిన తొలి 50 ఓవర్ల మ్యాచులో అంతగా రాణించలేని టీమిండియా హిట్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ.. రెండో వన్డేలో మాత్రం అద్భుతంగా రాణించాడు. దీంతో టీమిండియా ఓపెనర్లు ధాటిగా అడటం ప్రారంభించి భారత్ స్కోరును పరుగులు పెట్టించడంతో.. దానిని అందుకునే లక్ష్యంలో న్యూజీలాండ్ చతికిలపడింది. సొంతగడ్డపై తిరుగులేని రికార్డు ఉన్న న్యూజిలాండ్ను మరో వన్డేలో చిత్తుగా ఓడించి కోహ్లీసేన సత్తా చాటింది.
లక్ష్య ఛేదనలో ఓపెనర్ మార్టిన్ గప్తిల్(15)ను ఔట్ చేసి భువనేశ్వర్ భారత్కు శుభారంభం అందించాడు. గత కొన్ని మ్యాచ్ల్లో నిలకడగా కనీసం 50కి పైగా పరుగులు సాధిస్తూ వస్తున్న కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్రీజులోకి రాగానే వేగంగా ఆడాడు. రెండు సిక్సర్లు బాది జోరు మీదున్న కేన్ను షమీ బౌల్డ్ చేయడంతో ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాతమరో విధ్వంసకర ఓపెనర్ మున్రో(31)ను చాహల్ ఎల్బీడబ్లూగా వెనక్కి పంపడంతో 84 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది.
కుల్దీప్ తన స్పిన్ మాయాజాలంతో మిడిలార్డర్ పుంజుకోకుండా కివీస్ ఆటగాళ్లు టామ్ లాథమ్(34), హెన్రీ నికోల్స్(28), గ్రాండ్ హోం(3)లను పెవిలియన్ పంపి టీమిండియాకు విజయాన్ని ఖరారు చేశాడు. ఆఖర్లో బ్రాస్వెల్(57: 46 బంతుల్లో) ఫోర్లు, సిక్సర్లతో అర్ధశతకంతో మెరిసినా ప్రయోజనం లేకపోయింది. రెండో వన్డేలో భువనేశ్వర్ కుమార్(2/42), చాహల్(2/52) చైనామన్ బౌలర్ కుల్దీప్(4/45) యాదవ్ల ధాటికి కివీస్ 40.2 ఓవర్లలో 234 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 324 పరుగుల భారీ స్కోరు చేసింది. కివీస్ బౌలర్లపై విరుచుకుపడి భారత ఆటగాళ్లు తమదైన శైలిలో పరుగులు రాబట్టారు. ఓపెనర్లు రోహిత్ శర్మ(87), శిఖర్ ధావన్(66) అర్ధశతకాలతో చెలరేగారు. అర్థశతకాన్ని నమోదు చేసుకుని శతకంపైపు పరుగులు తీసే క్రమంలో రోహిత్ శర్మ వెనుదిరిగాడు.
అతడికి జోడిగా దిగిన శిఖర్ ధావన్ కూడా అద్బుత ప్రదర్శనతో రాణించి హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ప్రదర్శనలో మాత్రం జోరు తగ్గలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(43), అంబటి రాయుడు(47), ధోనీ(48 నాటౌట్), కేదార్ జాదవ్(22 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. మొదటి ఐదుగురు బ్యాట్స్మెన్ అందరూ 40కి పైగా స్కోరు సాధించడం భారత క్రికెట్లో ఇదే తొలిసారి కావడం విశేషం. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ఫర్గుసన్ చెరో రెండు వికెట్లు తీశారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more