అస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ తో పుల్ ఫామ్ లోకి వచ్చిన టీమిండియా దిగ్గజం ధోనీ అదే జోష్, అదే ఫామ్ ను ఇటు న్యూజిలాండ్ లోనూ కంటిన్యూ చేస్తున్నాడు. ఇవాళ న్యూజీలాండ్ తో జరిగిన రెండో వన్డేలో బ్యాటింగ్ చేసిన ఆయన 48 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్లో ఆయన మెరుపు వేగంతో చేసిన స్టన్నింగ్ స్టంపౌట్ వైరల్ గా మారింది. వికెట్ కీపింగ్లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు మిస్టర్ కూల్.
భారీ లక్ష్య ఛేదనలో కివీస్ తడబడుతోంది. కేదార్ జాదవ్ వేసిన 18వ ఓవర్లో మహీ స్టంపింగ్ మ్యాచ్లో హైలెట్గా నిలిచింది. జాదవ్ వేసిన తొలి బంతిని ముందుకు సాగి డిఫెన్స్ ఆడేందుకు రాస్ టేలర్ ప్రయత్నించగా అతని వెనుక కాలు కొద్దిసేపు గాల్లో ఉంది. అతని బ్యాక్ ఫూట్ కేవలం కొన్ని సెకన్లు మాత్రమే గాల్లో ఉండగా ధోనీ మెరుపు వేగంతో స్పందించి కివీస్ బ్యాట్స్మన్ను స్టంపింగ్ చేసి ఆశ్చర్యపరిచాడు.
జాదవ్ బౌలింగ్లో కళ్లు మూసి తెరిచేలోపు అతడు చేసిన స్టంపింగ్ చివరికి బౌలర్నూ షాక్కు గురి చేసింది. భారత నంబర్ వన్ జోడీగా ధోనీ-జాదవ్ నిలిచారని కితాబిచ్చారు. ఫామ్లో ఉన్న టేలర్(22) ఔటవడంతో కివీస్ కష్టాల్లో పడింది. ప్రపంచంలోనే అత్యంత ఉత్తమ వికెట్ కీపర్ ధోనీనేనని మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశంసిస్తున్నారు.
— MS (@premchoprafan) January 26, 2019
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more