టీమిండియా క్రికెటర్, 2011లో ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన మునాఫ్ పటేల్ చుట్టూ మ్యాచ్ ఫిక్సింగ్ ఉచ్చు బిగుసుకుంటోంది. రంగంలోకి దిగిన బీసీసీఐ ఈ అరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది. రాజ్పుటానా ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) సందర్భంగా జరిగిన మ్యాచుల్లో జరిగిన కొన్ని ఘటనలు ఇందుకు ఊతమిస్తుండడంతో బీసీసీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఆర్పీఎల్ కు కొంత మేరకు ఆర్థిక సాయం అందించిన ఓ వ్యక్తి ‘ఆర్గనైజ్డ్ క్రికెట్ రాకెట్’ వెనక ఉన్నట్టు రాజస్థాన్ పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి వ్యాపార లావాదేవీలన్నీ భారత్కు మూడు ఫార్మాట్లలోనూ ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి (మునాఫ్ పటేల్) తోనే ఉన్నట్టు గుర్తించారు.
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై మునాఫ్ను వివరణ కోరగా ఆ ఆరోపణలు అవాస్తవమని కొట్టి పడేశాడు. ఆర్పీఎల్ వంటి స్థానిక లీగ్లను ఫిక్స్ చేయలేమని పేర్కొన్నాడు. తనకు క్రికెట్ తప్ప మరో ప్రపంచం తెలియదని పేర్కొన్నాడు. తనపై ఎవరైనా ఆరోపణలు చేసినా.. అది సీఐడీ అయినా, ప్రభుత్వమైనా వదిలిపెట్టబోనని హెచ్చరించాడు. తాను బుకీని కానని, తన బెట్టింగ్కు పాల్పడలేదని మునాఫ్ స్పష్టం చేశాడు. ఆర్పీఎల్ లో ఓ మ్యాచ్ లో జరిగిన కొన్ని ఘటనలు ఫిక్సింగ్ ఆరోపణలకు ఊతమిచ్చాయి. ఆ మ్యాచ్లో బౌలర్ వరుసపెట్టి వైడ్లు వేశాడు. ప్రత్యర్థి జట్టు విజయానికి పది పరుగులు మాత్రమే అవసరమైన వేళ చివరి ఓవర్ వేసిన బౌలర్ ధారాళంగా వైడ్లు వేస్తూ పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తెరపైకి వచ్చాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more