భారత మహిళల క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ మహిళా క్రికెట్ లో అనితర సాధ్యమైన రికార్డును తన పేరున లిఖించుకుంది. టీమిండియా జట్టు కెప్టెన్ గానే కాకుండా ఒక క్రికెటర్ గా కూడా అమె టీమిండియా విజయాల్లో తన అద్బుత ప్రతిభతో కీలక పాత్ర పోషించారు. అత్యధిక వన్డేలు ఆడిన క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకూ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్ట్స్ అత్యధికంగా 191 వన్డేలాడిన క్రీడాకారిణిగా జాబితాలో అగ్రస్థానంలో ఉంది.
ఇప్పుడు మిథాలీ రాజ.. ఎడ్వర్ట్స్ ను రికార్డును దాటిసి తన పేరును తాజాగా కొత్త రికార్డును లిఖించుకున్నారు. నాగ్ పూర్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మహిళల మధ్య తొలి వన్డే జరుగుతోంది. ఈ వన్డే మిథాలీ రాజ్ కు 192 వది. దీంతో అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డేలు ఆడిన క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించింది. 1999 జూన్ లో మిథాలీ అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది. 192 వన్డేల్లో మిథాలీ 6,295 పరుగులు చేసింది. 10 ఇన్నింగ్స్ ల్లో బౌలింగ్ చేసి 8 వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డే క్రికెట్లో 6వేల మైలురాయి అందుకున్న తొలి క్రికెటర్ గా కూడా మిథాలీ.. ఇప్పటికే తన పేరున రికార్డును రాసుకుంది. రెండుసార్లు భారత జట్టును ప్రపంచకప్ ఫైనల్ కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్ మిథాలీ రాజ్ కావడం విశేషం.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more