పల్లెకలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడోవ, చివరి టెస్టు మ్యాచులో భారత ఓపెనర్లు సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా ఓపెనింగ్ జోడి శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ లు అత్యధిక ఓపెనింగ్ పార్టనర్ షిప్ ను నమోదు చేసిన ఓపెనర్ల జోడీగా ఘనతను సాధించారు. భారత స్కోరు 84 పరుగుల వద్దకు చేరుకోవడంతో భారత్ క్రికెట్ జట్టుకు ఈ రికార్డు సొంతమయింది.
దీంతో అత్యధిక పరుగులు సాధించిన ఓపెనింగ్ జోడిగా రాహుల్-ధావన్ లు పేరున ఈ రికార్డు నమోదైంది. దీనికితోడు, గత నాలుగేళ్లలో శ్రీలంకతో వంద అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రెండో ఓపెనింగ్ జోడీగా కూడా వీరు మరో ఘనతను సాధించారు. గత నాలుగేళ్లలో బంగ్లాదేశ్ ఓపెనర్లు సౌమ్యసర్కార్, తమీమ్ ఇక్బాల్ లు మాత్రమే శ్రీలంకలో 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
మరోవైపు, తొలి సెషన్ లో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వికెట్లు నష్టపోకుండా భోజన విరామ సమయానికి భారత్ 134 పరుగులు చేసింది. ఓపెనర్లు రాహుల్ ధావన్ లు అర్థశతకాలతో రాణించారు. టాస్ గెలిచిన విరాట్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో.. అందుకు తగ్గట్టుగానే ధావన్, రాహుల్ లు క్రీజులో చెలరేగిపోతున్నారు. శ్రీలంక బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. తొలి సెషన్ లోనే ఐదుగురు బౌలర్లను మార్చి మార్చి బౌలింగ్ చేయించిన శ్రీలంకకు వికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more