పల్లెకెలె వేదికగా జరగనున్న చివరి, మూడో టెస్టులో విజయం సాధించి.. చరిత్రను తిరగరాయాలిన విరాట్ సేన భావిస్తుంది. ఇప్పటికే టెస్టు సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. మూడో టెస్టులోనూ గెలిచి సరికొత్త రికార్డును సోంతం చేసుకోవాలని కృతనిశ్చయంతో వుంది. మూడు టెస్టుల సిరీస్ ను వైట్ వాష్ చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. పరాయి గడ్డపై అతిధ్య జట్టును క్లీన్ స్వీప్ చేసిన తొలి టీమిండియా జట్టుగా నిలవాలని పథక రచన చేస్తుంది.
భారత జట్టు తన 85 ఏళ్ల టెస్టు ప్రయాణంలో విదేశాల్లో మూడు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన దాఖలాలు లేవు. ఆ రికార్డును విరాట్ సేన తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఆ ఘనతను సాధించేందుకు భారత జట్టు కసరత్తులు చేస్తోంది. పల్లెకెలె ఇంటర్నేషనల్ స్టేడియంలో మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న టెస్టు మ్యాచ్ లో ఈ ఘనతను సాధించి.. విమర్శకులకు తమ విజయంతో సమాధానం చెప్పాలని ఉవ్విళ్లూరుతుంది.
ఇప్పటికే మహా దిగ్గజాలున్న టీమిండియా క్రికెట్ జట్టు సాధించని విజయాలను విరాట్ సేన సాధించిందని కోచ్ రవిశాస్త్రీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. దీనికి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా తనదైన శైలిలో చురకలంటించారు. రవిశాస్త్రీ పలు టెస్టు మ్యాచ్ లను చూడనట్లుంది అని వ్యంగంగా వ్యాఖ్యానించాడు. అంతటితో అగకుండా వరల్డ్ కప్ వరకు జట్టును విజయాల వైపు నడిపించి.. మరో మారు భారత్ కు ప్రపంచ కప్ ను అందించేలా వారిని అన్ని విభాగాల్లో సిద్దం చేయాలని బదులిచ్చిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more