ఇంగ్లండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో మ్యాన్ అప్ ది సిరీస్ కు ఎన్నికైన యువ క్రికెటర్ కేదర్ జాదవ్. పుణెలో జరిగిన తొలి వన్డేలో 76 బంతుల్లో 120 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన జాదవ్.. ఈ వన్డే సిరీస్ తన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అని చెప్పకొచ్చిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలో సెంచరీ తరువాత తన ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందన్నాడు. ఇదే ఫామ్ను కొనసాగిస్తే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకుంటానని ముందే అనుకున్నట్లు చెప్పుకోచ్చాడు.
ఆ తరువాత అడిన మిగిలిన రెండు వన్డేల్లో కూడా రాణించడంతో అనుకున్నట్లుగానే మ్యాచ్ అప్ ధి సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. అంతకుముందు న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ నాలో విశ్వాసాన్ని పెంచితే, ఇది నా కెరీర్లో టర్నింగ్ పాయింట్గా నిలిచిందని జాదవ్ తన పునరాగమనంపై సంతోషం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్ తో సిరీస్ లో భారీ పరుగులు సాధించలేకపోయినప్పటికీ, తనలోని ఆత్మవిశ్వాసం బలపడటానికి కారణమైందన్నాడు.
తనకు ఆలస్యంగా అవకాశాలు రావడం వల్ల జాదవ్ తనదైన శైలిలో స్పందించాడు. గతంలో తాను తగినంత పరిణితి చెందకపోవడం వల్లే అవకాశాలు రాలేదన్నాడు. ఈ కారణం చేతనే తనకు జాతీయ జట్టులో అవకాశాలు ఆలస్యంగా వచ్చాయన్నాడు.తనకు అవకాశాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ సంతోషంగా ఉన్నట్లు జాదవ్ తెలిపాడు. ప్రస్తుత అవకాశాల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటాననే ఆశాభవం జాదవ్ వ్యక్తం చేశాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more