మొహాలీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ హవాకొనసాగుతోంది. మూడో రోజు 274/6 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు అశ్విన్ (72), రవీంద్ర జడేజా (90) ఊపిరిపోశారు. అశ్విన్ అవుటైనప్పటికీ జడేజాతో కలిసి జయంత్ యాదవ్ (55) ఆడిన ఇన్నింగ్స్ ఇంగ్లండ్ కష్టాలు పెంచింది. వీరు ముగ్గురూ రాణించడంతో టీమిండియా 417 పరుగులకు ఆలౌట్ అయింది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ ను రవిచంద్రన్ అశ్విన్ తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. అశ్విన్ సంధించిన బంతి వికెట్లను గిరాటేయడంతో కుక్ (12) పెవిలియన్ చేరాడు. అనంతరం మెయిన్ అలీ (5) కూడా అశ్విన్ ఉచ్చులో చిక్కాడు. తరువాత బెయిర్ స్టో (15)ను జయంత్ యాదవ్ అవుట్ చేశాడు. తరువాత వచ్చిన బెన్ స్టోక్స్ (15) ను అశ్విన్ పెవిలియన్ కు పంపాడు. దీంతో మూడోరోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు తన రెండో ఇన్నింగ్స్ 38 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది.
నిలదొక్కుకున్న రూట్ (29) ఆకట్టుకోగా, అతనికి జతగా బెట్టీ దిగాడు. టీమిండియా బౌలర్లలో మూడు వికెట్లతో అశ్విన్ రాణించగా, అతనికి జయంత్ యాదవ్ ఒక వికెట్ తీసి చక్కని సహకారమందించాడు. ఈ ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు ఇంకా 56 పరుగులు వెనుకబడి ఉంది. పిచ్ బౌలర్లకు సహకరిస్తుండడంతో రేపు ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more