ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు గెలుపు దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే పర్యాటక జట్టు చేతిలో వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన సఫారీలు.. తొలి టెస్టులో కూడా విజయం వైపు పయనిస్తున్నారు. తొలి రెండు రోజులు గెలుపు ఇరు జట్ట మద్య దోబూచులాడినా.. మూడో రోజు నుంచి దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లు బాగా రాణించడంతో.. పటిష్ట స్థితిలో వుంది. మూడో రోజు ఆరు వికెట్లు కోల్పోయి 390 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాల్గవ రోజున మరింతగా పుంజుకుంది. నాల్గవ రోజున ఫీలాండర్ 73, డికాక్ 64 రాణించడంతో దక్షిణాఫ్రికా 540 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.
దక్షిణాఫ్రికా విసిరిన 539 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఆసీస్ ఆటగాళ్లు షాన్ మార్ష్(15),డేవిడ్ వార్నర్(35),స్టీవ్ స్మిత్(34), వోగ్స్(1)లు పెవిలియన్ చేరారు. దక్షిణాఫ్రికా పేసర్ రబడా విజృంభించి మూడు వికెట్లు తీశాడు. ఉస్మాన్ ఖవాజా(58 బ్యాటింగ్), మిచెల్ మార్ష్(15 బ్యాటింగ్)క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే సోమవారం చివరి రోజంతా ఆడాల్సి వుంది. అదే సమయంలో ఆసీస్ విజయానికి మరో 370 పరుగులు కావాల్సి ఉండగా, సఫారీల విజయానికి ఆరు వికెట్లు అవసరం ఏర్పడింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more