ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం వేదికగా పర్యటక జట్టు న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో టీమిండియా అదిలోనే వికెట్లను కొల్పోయి కష్టాల్లో పడినా, అ తరువాత కోలుకుని నిదానంగా రాణించి మొత్తానికి పైచేయి సాధించింది. తొలి రోజు అట ముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్లను కోల్పోయి 267 పరుగులను సాధించింది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఫస్ట్ డే ఆటను టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ముచ్చటగా మూడో టెస్టు కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్న టీమిండియాకు అదిలోనూ కష్టాల ముంచెత్తాయి.
ఓపెనర్ మురళీ విజయ్ (10) పరుగుల వద్ద ఔట్ అయ్యి పెవీలియన్ బాట పట్టగా, రెండేళ్ల సుదీర్ఘ విరామం తరువాత పున:ప్రవేశం చేసిన గౌతమ్ గంభీర్ మూడు ఫోర్లు, రెండు సిక్స్ లతో అకట్టుకున్నాడు, అంతలోనే ఎల్బీడబ్యూగా 29 పరుగల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు, అనంతరం వచ్చిన డిపెండబుల్ ఛటేశ్వర్ పుజారా (41) నిలదొక్కుకుని కీలక సమయంలో అవుటయ్యాడు. దీంతో కేవలం 100 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పీకలొత్తు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, డిపెండబుల్ అజింక్యా రహానే జతకలిసి జట్టును ఆదుకున్నారు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ అజేయ సెంచరీ(191 బంతుల్లో 103: 10 ఫోర్లు) సాధించాడు. స్వదేశంలో 17 ఇన్నింగ్స్ ల తర్వాత కోహ్లీ శతక్కొట్టాడు. చివరగా 2013 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాపై చెన్నై టెస్టులో శతకం చేశాడు. మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. దీంతో వరుసగా మూడో టెస్టులోనూ టీమిండియానే పైచేయి సాధించింది. కోహ్లీ, అజింక్యా రహానే(172 బంతుల్లో 79 నాటౌట్: 9 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్ కు అభేద్యమైన 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 37వ ఓవర్ నుంచి తొలి రోజు ఆట నిలిపివేసే వరకూ రహానే, కోహ్లీలు కివీస్ బౌలర్లకు మరో అవకాశం ఇవ్వలేదు. వీరి అజేయ భాగస్వామ్యం (167)తో తొలిరోజు భారత్ పైచేయి సాధించింది. కివీస్ బౌలర్లలో పటేల్, బౌల్ట్, శాంట్నర్ తలో వికెట్ తీశారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more