టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ లో ఒక మ్యాచ్ లో పేలవ ప్రదర్శనతో విమర్శలను ఎదుర్కున్నాడు. నెట్ జనులు విరాట్ చెత్త ఆటపై సైటర్లు నానా రకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే ఈ సారి అస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ లో రోహిత్ శర్మ రెండు మ్యాచ్ లలో రెండు సెంచరీలను సాధించినా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది, అదేంటీ చెత్త ప్రదర్శన చేస్తే కదా విమర్శలు విసరాల్సింది. అద్భుతంగా రాణించినా.. రోహిత్ శర్మ విమర్శల పాలు కావడమేంటి..? అనేగా మీ డౌట్..
తొలి వన్డేలో సెంచరీ చేసినా పరాజయం పాలైన సందర్భంగా, మళ్లీ రెండో వన్డేలో కూడా శతకం బాదినా.. ఇండియా ఓటమిపాలవ్వడంతో సోషల్ మీడియాలో రోహిత్ పై విమర్శలు మొదలయ్యాయి. రోహిత్ సెంచరీ చేస్తే టీమిండియా ఓటమి ఖాయమని నెటిజన్లు పేర్కొన్నాడు. మూడనమ్మకాలు, సెంటిమెంట్లకు మేం దూరం అంటూనే.. నెట్ జనులు రోహిత్ పై విమర్శలను సందిస్తున్నారు. ఎవరైనా తనకు వచ్చిన అటను సరిగ్గా ఆడకపోతే విమర్శలపాలవుతారు కానీ రోహిత్ మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితిని ఎదుర్కోంటున్నాడు.
దీనిపై రోహిత్ మాట్లాడుతూ, ఎంత భారీ స్కోరు చేసినప్పటికీ జట్టు ఓటమిపాలైతే బాధేస్తుందని తెలిపాడు. రికార్డుల కోసం తాము ఆడడం లేదని, జట్టు విజయం కోసం ఆడుతామని, ఎంత బాగా ఆడినా జట్టు పరాజయం పాలైతే సాధించిన ఘనతను ఆస్వాదించలేమని చెప్పాడు. సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు బాధించినప్పటికీ, వాటిలో వాస్తవముందని రోహిత్ శర్మ తెలిపాడు. అయితే విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగడమే ప్రతి ఆటగాడి ముందున్న కర్తవ్యమని రోహిత్ తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more