ఐపీఎల్ లోకి కొత్తగా ప్రవేశించి రివర్స్ బిడ్డింగ్ లో స్థానం దక్కించుకుని సంతోషంతో సంబరపడుతున్న కొత్త జట్లకు ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవడం లేదు. రానున్న రెండు సంవత్సరాల్లో వందల కోట్ల రూపాయల నష్టాలను సదరు రెండు నూతన జట్లు భరించాల్సిన పరిస్థితులు అలుముకున్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై సస్పెండయిన ఐపీఎల్ టీమ్ లు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ స్థానంలో రివర్స్ బిడ్డింగ్ విధానంలో ఎంపికైన కొత్త ఫ్రాంచైజీలకు ఆదిలోనే భారీ నష్టాలు కళ్లముందు కనిపిస్తున్నాయి. రాజ్ కోట్, పుణెలు కొత్త ఫ్రాంచైజీలను దక్కించుకున్న ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటెక్స్ సంస్థ, కోల్ కతా వ్యాపారి సంజీవ్ గోయంకాలు వచ్చే రెండేళ్లలో రూ. 100 కోట్ల నుంచి రూ. 120 కోట్ల వరకూ నష్టపోనున్నారని నిపుణులు లెక్కగడుతున్నారు. మొత్తంగా ఈ రెండు జట్టు రూ. 240 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఏదైనా ఐపీఎల్ టీం వార్షిక ఖర్చు రూ. 95 కోట్ల నుంచి రూ. 100 కోట్లను మించరాదు. ఇక వారికి వచ్చే ఆదాయాన్ని లెక్కిస్తే... స్పాన్సర్ షిప్ లు రూ. 22 కోట్లను మించరాదు. పుణెలో క్రీడాభిమానుల నుంచి టికెట్ల రూపంలో వచ్చే ఆదాయం (7 మ్యాచ్ లకు స్టేడియం పూర్తిగా నిండితే రూ. 21 కోట్లు (పుణెలో), రూ. 16 కోట్లు (రాజ్ కోట్ లో) వస్తుంది. ఇక ఆహారం, శీతల పానీయాలు తదితరాల అమ్మకం ద్వారా మరో రూ. 50 లక్షల వరకూ ఆదాయం రావచ్చని అంచనా. మొత్తం ఆదాయం కలిపినా పుణె ఫ్రాంచైజీకి 43.5 కోట్లు, రాజ్ కోట్ ఫ్రాంచైజీకి రూ. 38.5 కోట్లను మించే అవకాశాలు కనిపించడం లేదు. దీనికితోడు ఐపీఎల్ సెంట్రల్ రెవెన్యూ నుంచి ఈ టీములకు ఒక్క రూపాయి కూడా దక్కదు. అంటే, ఈ ఫ్రాంచైజీల యాజమాన్యం ఒక్కో ఐపీఎల్ సీజనులో రూ. 50 కోట్ల నుంచి రూ. 55 కోట్ల వరకూ నష్టాన్ని భరించాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more