దక్షిణాఫ్రికాతో ఢిల్లీ వేదికగా ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న చివరిదైన నాల్గవ టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యం సాధించింది. శనివారం రెండో ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియా 81.0 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. దీంతో విరాట్ సేన మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఓవరాల్ గా 403 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి (83 బ్యాటింగ్) అజింక్యా రహానే(52 బ్యాటింగ్)లు మరోసారి అర్థశతకాలతో రాణించిడంతో టీమిండియాకు భారీ ఆధిక్యం లభించింది. టీమిండియా 57 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి తడబడిన సమయంలో విరాట్-రహానే జోడి ఆదుకుంది. ఈ జోడి అజేయంగా 133 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాను పటిష్టస్థితికి చేర్చారు.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే ఎనిమిది పరుగులకే మురళీ విజయ్, రోహిత్ శర్మల రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరువాత శిఖర్-పూజారాల జోడి మరమ్మత్తులు చేపట్టింది. కాగా, 45 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన ఈ జోడి లంచ్ తరువాత నాలుగు పరుగుల వ్యవధిలో నిష్క్రమించడంతో టీమిండియా జట్టులో కలవరం మొదలైంది. అప్పడు క్రీజ్ లోకి అడుగుపెట్టిన కెప్టెన్ విరాట్ , రహానేలు దాటిగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలించడంతో తిరిగి టీమిండియా గాడిలో పడింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోర్నీ మోర్కెల్ మూడు వికెట్లు తీయగా, ఇమ్రాన్ తాహీర్ కు ఒక వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 213 అధిక్యత లభించింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more