సౌతాఫ్రికా ఆశలకు ఇండియన్ క్రికెటర్లు కల్లెం వేశారు. వరుస అపజయాలతో వెనుకబడిన సౌతాఫ్రికా నాలుగో టెస్టులో విజయం సాధించి కనీసం పరువు నిలుపుదామని అనుకున్న సౌతాఫ్రికా క్రికెటర్లకు చుక్కలు చూపించారు ఇండియన్ ప్లేయర్స్. అద్భుతమైన బౌలింగ్ తో మన బౌలర్లు ప్రత్యర్థి టీంకు చమటలు పట్టించారు. మొదటి టెస్ట్ నుండి ఎంత దూకుడుగా ఆడిందో అదే దూకుడుతో నాలుగో టెస్ట్ లో కూడా టీమిండియా విక్టరీని నమోదు చేసింది. ఫిరోజ్ షా స్టేడియంలో సౌతాఫ్రికా బ్యాట్స్ మన్స్ కు మన బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ భారత బౌలర్ల ధాటికి వెంటవెంటనే పెవిలియన్కు చేరుకున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 121 రన్స్కు ఆలౌటైంది. దీంతో భారత్కు మొదటి ఇన్నింగ్స్లో 213 పరుగుల ఆధిక్యం లభించింది.
మొదటి మూడు టెస్టుల్లో స్పిన్నర్లు హవా చాటినా.. ఈ టెస్టులో స్పిన్నర్లతో పాటు పేస్ బౌలర్లు కూడా రాణించారు. రవింద్ర జడేజా టెస్టుల్లో మరోసారి అయిదు వికెట్లు తీసుకున్నాడు. ఉమేశ్ యాదవ్, ఇశాంత్ శర్మలు కూడా వికెట్లు తీయడంతో సౌతాఫ్రికా బ్యాట్స్మెన్లు కంగారుపడ్డారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలిర్స్ ఒక్కడే అత్యధికంగా 42 రన్స్ చేశాడు. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అజింక్య రహానే సెంచరీతో ఆకట్టుకున్నాడు. రహానే 11 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 127 రన్స్ చేశాడు. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ హాఫ్ సెంచరీతో రహానేకు అండగా నిలిచాడు. అశ్విన్ 56 రన్స్ చేశాడు.మొత్తంగా టీమిండియా నాలుగో టెస్ట్ లో కూడా తన విజయ దుందుభిని కొనసాగించింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more