రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భాగంగా దక్షిణాఫ్రికా నిర్దేశించిన (271) స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా చతికలపడిపోయింది. కేవలం 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 271 పరుగుల లక్ష్యంతో దిగిన భారత్ లక్ష్యం దిశగా పయనించినా.. చివర్లో కీలక వికెట్లు కోల్పోవడం, సాధించాల్సిన రన్రేట్ ఎక్కువగా ఉండటంతో బోల్తాపడింది. దీంతో టీమిండియా ఆటగాళ్లపై మళ్లీ విమర్శల వర్షం కురుస్తోంది. రెండో వన్డేలో అద్భుతంగా రాణించిన ఇండియా జట్టు.. మూడో వన్డేలో ఎందుకు ఓడిపోయిందంటూ క్రికెట్ అభిమానులు ప్రశ్నలు కురిపించడం మొదలుపెట్టేశారు. దీంతో కెప్టెన్ ధోనీకి ఈ ఓటమిపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో పిచ్ స్వభావం పూర్తిగా మారిపోవడంతో తాము లక్ష్యాన్ని సాధించలేకపోయామని కెప్టెన్ ధోనీ అన్నాడు. తొలుత పిచ్ బాగానే అనుకూలించిందని.. కానీ రానురాను స్లోగా మారిందని, దీంతో పరుగులు చేయడం బ్యాట్స్మెన్కు కష్టమైందని చెప్పాడు. తొలుత బ్యాట్స్ మెన్లు లక్ష్యం దిశగా పరుగులు తీసినప్పటికీ.. ఆ తర్వాత పిచ్ సరిగ్గా అనుకూలించకపోవడంతో స్కోర్ చేయడంలో చతికిలపడ్డామని ధోనీ స్పష్టం చేశాడు. అయితే.. ఈ మూడో వన్డేలో భారత బౌలర్లు అద్భుతంగానే రాణించారని ధోనీ కితాబిచ్చాడు. అయితే లక్షసాధనకు దిగాక పిచ్ క్రమేణా నెమ్మదించడంతో, పరుగులు చేయడం కష్టమైందని చెప్పాడు. ఈ వికెట్ బ్యాటింగ్కు అనుకూలిస్తుందని, స్పిన్నర్లకు సహకరించదని మొదట్లో భావించానని అయితే తన అంచనా తప్పిందని మహీ వివరించాడు. ఇక మిడిలార్డర్లో విఫలమవుతున్న రైనాకు ధోనీ అండగా నిలిచాడు. రైనా షాట్ ఆడబోయేముందు కాస్త సమయం తీసుకోవాలని సూచించాడు.
ఇదిలావుండగా.. మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 270 పరుగులు చేసింది. ఓపెనర్ డీకాక్ (103 నాటౌట్), మిల్లర్ (33) శుభారంభం అందించారు. డు ప్లెసిస్(60), బెహర్దియన్ (33 నాటౌట్) ఆకట్టుకున్నారు. ఇక 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆటగాళ్లో రోహిత్ శర్మ(65), విరాట్ కోహ్లి(77), మహేంద్ర సింగ్ ధోని(47)లు రాణించినా.. ఆఖరి ఓవర్లలో తీవ్ర ఒత్తిడికి గురికావడంతో పరాజయం తప్పలేదు. దీంతో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more