టీమిండియాపై గెలుపడం అంత సులువైన విషయం కాదని భారత మాజీ కెప్టెన్, టీమిండియా క్రమశిక్షణా సంఘం సభ్యుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికా జట్టులో లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ కొంత ప్రమాదకర బౌలర్ గా అయన చెప్పుకోచ్చారు. అక్టోబర్ 2 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న నాలుగు టెస్టు మ్యాచ్, ఐదు వన్డే, మూడు టీ20 సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సౌరవ్ గంగూలీ విరాట్ కోహ్లీ కెప్టెన్సీని ప్రశంసించాడు. సపారీలతో జరిగే మ్యాచ్ లలో గెలుపు కోసం బ్యాటింగ్ కూడా కీలక భూమిక పోషిస్తుందని అన్నారు.
సుమారుగా రెండు సంవత్సరాల తరువాత స్వదేశంలో సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న పొడుగాటి సిరీస్ లోనూ టెస్టులకు అధిక ప్రాధాన్యత వుంటుందని అభిప్రాయపడ్డారు. స్పిన్ కు అనుకూలంగా పిచ్ లను సిద్దం చేయడంతో.. ఈ పిచ్ లపై సఫారీల స్పినర్లు ఇమ్రాన్ తాహీన్, హాషిమ్ అమ్లాలు కూడా రాణించే అవకాశముందని వారి బంతులను జాగ్రత్తా ఎదుర్కోవాలని గంగూలీ టీమిండియా ఆటగాళ్లకు సూచించాడు. ముఖ్యంగా స్వ్కేర్ కట్ షాట్స్ అడే వారు ఇమ్రాన్ బాలింగ్ లో ఇబ్బందులు పడే ప్రమాదముందని చెప్పాడు.
స్వధేశంలో టీమిండియా బాగా రాణిస్తుందని, గత కోన్నేళ్లు స్వదేశంలోని రికార్డులను పథిలపర్చుకుంటున్న టీమిండియా సఫారీలతోనూ భాగానే రాణిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో సౌత్ ఆప్రికాపై నెగ్గుకు వచ్చేందుకు టీమిండియా ఆటగాళ్లకు పలు సూచనలు చేశారు. నాలుగో రోజున వికెట్లు అధికంగా పడతాయని, అప్పటి నుంచి ఆట మలుపుతిరుగుతుందని సూచించారు. స్వదేశంలో మ్యాచ్ లు గెలవడానికి బ్యాటింగ్ కూడా కీలక భూమిక పోషిస్తుందని అన్నారు. స్కోరుబోర్డుపై 500 పైచిలకు పరుగులను నిలపి.. ప్రత్యర్థులకు ఆ లక్ష్యాన్ని నిర్ధేశిస్తే విజయం టీమిండియాను వరించే అవకాశాలున్నాయని అశాభావం వ్యక్తం చేశారు. గెలుపే లక్ష్యంగా, గెలవడమే అంతా అన్నట్లుగా వ్యవహరించే విరాట్ కోహ్లీ.. బాడీ లాంగ్వేజ్ అప్పుడప్పుడు పరిధి దాటినా.. ఆయన మైండ్ సెట్ మాత్రం తనకు చాల నచ్చుతుందని గంగూలి కోహ్లీని వెనకేసుకుని వచ్చాడు. అతనిపై ప్రశంసలను కురిపించాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more