భారత్ తో యూఏఈలో డిసెంబర్ లో జరగాల్సిన సిరీస్ పై ఇంకా నీలి నీడలు వీడలేదు. ఈ సిరీస్ పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆసక్తి కనబరుస్తున్నా.. బీసీసీఐతో చర్చలు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. అయితే భారత పర్యటనపై పాకిస్థాన్ ట్వంటీ 20 కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది తనదైన శైలిలో స్పందించాడు. ఇప్పటివరకూ బీసీసీఐ నుంచి ఎటువంటి స్పష్టతా లేని నేపథ్యంలో వారి వెంట పడటం అనవసరమని ఆఫ్రిది పేర్కొన్నాడు. ఈ మేరకు తన సలహాను పీసీబీకి తెలియజేసిన ఆఫ్రిది అనంతరం లాహోర్ లో మీడియాతో మాట్లాడాడు. పాకిస్థాన్ తో సిరీస్ కు భారత్ ను ఆహ్వానించే క్రమంలో చర్చలను ఇక వదిలి పెట్టి.. మిగతా టీమ్ లను స్వదేశానికి ఆహ్వానిస్తే బాగుంటుందని ఆఫ్రిది తెలిపాడు.
టీమిండియాతో ఎక్కువ క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. పాకిస్థాన్ పదే పదే టీమిండియాను సంప్రదించడం సరైన విధానం కాదనేది నా అభిప్రాయం. అసలు వారికి ఇష్టం లేనప్పుడు ..పీసీబీ మాత్రమే వారిని ఎందుకు కలవాలి. ప్రస్తుతం టీమిండియాతో సిరీస్ గురించి చర్చలు ఆపేసి.. వేరే దేశాలను పాకిస్థాన్ పర్యటనకు ఆహ్వానించండి' అని ఆఫ్రిది బోర్డుకు తెలిపాడు. 2007 తరువాత ఓ సిరీస్ లో భాగంగా 2012-13 వ సంవత్సరంలో భారత పర్యటనకు పాకిస్థాన్ వచ్చింది. ఆ తరువాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగలేదు. కాగా, ఇరుదేశాల ఒప్పందం ప్రకారం 2015 నుంచి 2023 వరకూ ఆరు సిరీస్ లు జరగాల్సి ఉంది. అయితే పదే పదే కాల్పుల విరమ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ తో సిరీస్ లు జరపడానికి బీసీసీఐ సుముఖత వ్యక్తం చేయడం లేదు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more