టీమిండియా జట్టులో నాయకత్వ విభేదాలు వున్నాయంటూ గతకొన్నాళ్ల నుంచి మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా తాజాగా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. జట్టులో వున్న నాయకత్వ మంటలను ఇతగాడు తన కామెంట్లతో మరింత రగిల్చేశాడు. ఇంతకి ఇతగాడు ఏమన్నాడు? అనేగా మీ సందేహం.. ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!
బంగ్లా టూర్ లో టీమిండియా ఘోరంగా పరాజయం పాలైన విషయం తెలిసిందే! పసికూనగా కొనసాగుతున్న బంగ్లా చేతిలో.. ప్రపంచ హావ్ పేవరేట్ అయిన టీమిండియా జట్టు ఓడిపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఇక ఇండయా అభిమానులు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మీడియా ప్రతినిధి ఈ ఓటమికి గల కారణాలేంటో చెప్పాల్సిందిగా కోహ్లీని ప్రశ్నిస్తే.. అతగాడు తనదైన శైలిలో జవాబిచ్చాడు. ‘డ్రెస్సింగ్ రూంలో నెలకొన్న సమస్యల కారణంగా సరైన నిర్ణయాలు తీసుకోలేక ఓడిపోయాం’ అని చెప్పాడు. ఈ విధంగా అతగాడు చేసిన వ్యాఖ్యలు కేవలం జట్టులోనే కాక ఇటు క్రీడాభిమానుల్లోకూ అలజడి రేపాయి.
ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా కోహ్లీ మాట్లాడుతూ.. ‘డ్రెస్సింగ్ రూంలో నెలకొన్న కొన్ని సమస్యల కారణంగా మా ఆలోచనల్లో స్పష్టత లేకుండా పోయింది. దీంతో మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాం. నిర్ణయాలు తీసుకునే సమయంలో ఎంతో ఊగిసలాట నెలకొంది. అదే మైదానంలోనూ కనిపించింది. ఈ విషయాన్ని నేను చెప్పనక్కర్లేదు. ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయలేకపోతున్నారనే విషయాన్ని క్రికెట్ ను పరిశీలిస్తున్న నిపుణుల నుంచి సాధారణ అభిమానుల వరకు ఆ విషయాన్ని గమనించగలరు. స్పష్టమైన వ్యూహాలు లేనిపక్షంలోనే మొదటి రెండు వన్డేలు ఓడిపోయాం’ అని అన్నాడు.
కోహ్లీ ఈ విధంగా పేర్కొన్న ఈ మాటలను గమనిస్తుంటే.. ధోనీకి, ఇతనికి మధ్యనున్న పొరపొచ్చాలు మళ్లీ రగిలాయని తెలిసిపోతోంది. తన ప్రసంగంలో ధోనీ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ.. మొత్తం సారాంశంలో మాత్రం అతని పేరే కనిపిస్తోంది. దీంతో.. వీరి మధ్య విభేదాలు వున్నట్లుగా వస్తున్న వార్తలు కోహ్లీ వ్యాఖ్యలతో స్పష్టం అవుతున్నాయని చెప్పకనే చెప్పొచ్చు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more